‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న ప్రాజెక్ట్ ‘సర్కారువారి పాట’. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఈ మధ్యే జోరందుకుంది. మొన్నామధ్య దుబాయ్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఆతర్వాత కొద్దిరోజులు హైదరాబాద్‌లో షూట్ చేశారు. ఆ తర్వాత గోవాకు వెళ్లిన చిత్రయూనిట్ అక్కడి నుంచి తిరిగొచ్చి మళ్లీ హైదరాబాద్ లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇకపై గ్యాప్ ఇవ్వకుండా శరవేరంగా పూర్తిచేయాలని డిసైడ్ అయ్యాడట మహేశ్ బాబు. అందుకే గత కొన్ని వారాలుగా చిత్రయూనిట్ విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో స్పెయిన్ వెళ్లనుందట సర్కారువారి పాట చిత్రయూనిట్.


Also Read:'మరో ప్రస్థానం' ట్రైలర్.. 'లవ్ స్టోరీ'కి మెగాస్టార్ సపోర్ట్.. షణ్ముఖ్ జెన్యూన్ అంటున్న యాంకర్..


అక్టోబరు మొదటి వారం నుంచి నెలాఖరులోగా స్పెయిన్ లో  టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ జోరు చూస్తుంటే త్వరలోనే గుమ్మడి కాయ కొట్టేసేట్టున్నారు.నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని ఘట్టమనేని అభిమానులు ఫిక్సైపోయారు.


ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో పూజ హెగ్డే, ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ హీరోయిన్లు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే  సంజయ్ పాత్రకు సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని.. త్వరలోనే ఆయనకు దాన్ని వినిపించే అవకాశం ఉంది అని సమాచారం.


Also read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !


Also Read: నేటి నుంచి ఏపీ ఐసెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..


Also read: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ