హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. ‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నది. రస్సో బ్రదర్స్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా  ‘సిటాడెల్‘ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. ఇప్పటికే  వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 


సిటాడెల్’ ప్రీమియర్ షోక్ హాజరైన ఇండియన్ ‘సిటాడెల్’ టీమ్


తాజాగా ‘సిటాడెల్‘ ప్రీమియర్ షోను లండన్ లో వేశారు. ఈ షోకు ఇండియన్ వెర్షన్ నటీటనలు, దర్శకులు సమంత, వరుణ్ ధావన్,  రాజ్, డీకే హాజరయ్యారు. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించారు. వరుణ్ బ్లాక్ సీ-త్రూ టీ-షర్ట్, మ్యాచింగ్ డెనిమ్‌, షూ, జాకెట్‌ను ధరించగా, సమంత స్టేట్‌మెంట్ నెక్‌పీస్,  బ్రాస్‌ లెట్‌ తో కూడిన బ్లాక్ కో-ఆర్డ్ సెట్‌లో ఉంది. ఈ కార్యక్రమంలో రాజ్, డీకేతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రియాంక ఆఫ్-షోల్డర్ రెడ్ గౌనులో అందంగా కనిపించారు. నటుడు రిచర్డ్ మాడెన్ బ్లాక్ సూట్‌ వేసుకున్నారు. ప్రియాంక భర్త నిక్ జోనా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా కూడా ఈ ప్రీమియర్‌కు హాజరయ్యారు.






ఏప్రిల్ 28 నుంచి ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్


ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ కు సంబంధించిన రెండు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కు రానున్నది.  దాని తర్వాత ప్రతి శుక్రవారం మే 26 వరకు వారానికో కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన  ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం,  కన్నడ, మలయాళంలోనూ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. ‘సిటాడెల్’ స్పై ఏజెంట్లుగా ప్రియాంక, మాడన్ సూపర్ డూపర్ యాక్షన్ తో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఆకట్టుకున్నాయి. గన్స్, బాంబ్స్ మోతలతో భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ నిండిపోయింది. ట్రైలర్ స్టార్టింగ్ మొదలుకుని చివరి వరకు కన్ను ఆర్పకుండా చూసేలా ఉంది.



ఇదే ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా  స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది. తాజాగా  ఈ సిరీస్ గురించి సమంతా మీడియాతో మాట్లాడింది. “ది ఫ్యామిలీ మ్యాన్‌లో పనిచేసిన రాజ్, డీకేతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఉన్నా, సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాతో ఓపికగా, దయతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు” అని వివరించింది.


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?