ఫార్ములా ఈ రేసింగ్ కు భాగ్యనగరం రెడీ అయ్యింది. రేపటి నుంచి హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ముల కార్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ రేసులో భారతీయ సంస్థ అయిన మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో మహింద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాను, టెక్ మహీంద్రా సీఎండీ గుర్నానిని హీరో రాంచరణ్ కలిశాడు. దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ-ప్రిలో పాల్గొంటున్న మహీంద్రా గ్రూప్‌ నకు రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పాడు.


ఆనంద్ మహీంద్రాను కలవడం సంతోషంగా ఉంది- రామ్ చరణ్


భారత్ లో తొలిసారి జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ మహానగరం తొలిసారి ఆతిథ్యం స్తోంది. ఫార్ములా-ఈ రేసింగ్‌ లో పాల్గొనే జనరేషన్-3 ఫార్ములా-ఈ రేస్ కారును తాజాగా మహీంద్రా గ్రూప్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. అటు  టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఆటో అండ్ ఫాం సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజిరూకర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ మాట్లాడారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆటో దిగ్గజ అధినేతను కలవడం సంతోషంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. ఈ రేసింగ్ మరింత సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరానికి ఇలాంటి గొప్ప రేసింగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో చొరవ చూపారని వెల్లడించారు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.   










దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న రామ్ చరణ్


ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ‘RC 15’ పేరుతో వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. రెండోసారి మళ్లీ జోడీ కడుతోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన ఓ పాట షూట్ చేయనున్నారు. దర్శకుడు శంకర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.  


Read Also: బాబోయ్! షారుఖ్ వాచ్ ధర అన్ని కోట్లా? ఇంతకీ దాని ప్రత్యేక ఏంటో తెలుసా?