Rana Rakshasa Raja Movie First Look Poster: టాలీవుడ్ స్టార్ హీరో రానా, దర్శకుడు తేజ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’. 2017లో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న దర్శకుడు తేజకు సాలిడ్ సక్సెస్ అందించింది. ఈ సినిమాలో రానాను గతంలో ఎప్పుడూ లేని విధంగా చూపించారు దర్శకుడు తేజ. రానాలోని కొత్త వేరియేషన్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో లవ్ ట్రాక్ బాగా ఆకట్టుకుంది. ఎమోషనల్ క్లైమాక్స్, సినిమా చివర లో రానా స్పీచ్ అద్భుతంగా అలరించాయి. అన్ని విషయాల్లో దర్శకుడు ఫుల్ కేర్ తీసుకోవడంతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.


'నేనే రాజు నేనే మంత్రి' సీక్వెల్ గా ‘రాక్షసరాజా’


'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రానాతో పాటు తేజ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు 6 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14 ) సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘రాక్షసరాజా’ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో రానా లుక్ టెర్రిఫిక్ గా చూపించారు. చేతిలో మిషన్ గన్ పట్టుకొని, నుదుట నామాలు, నోట్లో చుట్టతో బీభత్సంగా కనిపిస్తున్నారు. రానా ఫస్ట్ లుక్ సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వేళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఉంటుందా? లేదంటే కొత్తవారిని తీసుకుంటారా? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనే పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.






‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న రానా


ఇక ఈ ఏడాది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రానా. సీనియర్ నటుడు, బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఇందులో నటించారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఏకైక ఇండియన్ సిరీస్‌గా రికార్డు సాధించింది. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించారు. కంటెంట్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్న ఈ సిరీస్ కి సీక్వెల్ రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ‘రానా నాయుడు’ సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. సూప‌ర్న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సిరీస్ సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు నిఖిల్ నటించిన స్పైలో అతిథి పాత్రలోనూ రానా కనిపించారు.


Read Also: బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?