సినిమా ఈవెంట్స్ లో సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారిని తాకాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలో స్టార్స్ ను చుట్టుముడుతుంటారు ఫ్యాన్స్. వారిని అడ్డుకోవడానికి బౌన్సర్లు రెడీగా ఉంటారు. రీసెంట్ గా సాయిపల్లవిని కూడా కొందరు అభిమానులు చుట్టుముట్టారు. వెంటనే ఆమె కోస్టార్ రానా దగ్గుబాటి వారందరినీ అడ్డుకొని సాయిపల్లవికి రక్షణగా నిలిచారు. వీరిద్దరూ కలిసి నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి పాల్గొంటుంది. దాదాపు అన్ని ఈవెంట్స్ లో ఆమెకి సపోర్ట్ గా నిలిచారు రానా. మొన్నామధ్య జరిగిన ఈవెంట్ లో వర్షం పడుతుంటే సాయిపల్లవికి గొడుగు పట్టారు రానా. ఒక స్టార్ హీరో అయి ఉండి అలా చేయడంతో నెటిజన్లు అతడిని ప్రశంసించారు. ట్రూ జెంటిల్మెన్ అంటూ కామెంట్స్ చేశారు. 


ఇక రీసెంట్ గా జరిగిన 'విరాటపర్వం' సినిమా ఫంక్షన్ లో సాయిపల్లవి స్పీచ్ ఇస్తుండగా.. కొందరు అభిమానులు ఆమె దగ్గరకి రాబోయారు. వెంటనే రానా వారిని అడ్డుకొని సాయిపల్లవి స్పీచ్ పూర్తవ్వగానే ఆమెని దగ్గరుండి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా.. రానా కేరింగ్ పై స్పందించింది సాయిపల్లవి. 


రానా తనతో మాత్రమే కాకుండా.. సెట్స్ లో ఉండే అమ్మాయిలతో అలానే ఉంటారని.. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. తను ఈవెంట్స్ కి వెళ్లేప్పుడు ఫ్యాన్స్ దగ్గరకు వచ్చేవారని.. ఆ సమయంలో రానా అరిచి వాళ్లను పక్కకు పంపేవారని తెలిపింది. అలా రానా తనకు బౌన్సర్ లా మారిపోయారని.. ఆయన చాలా మంది కోస్టార్ అని చెప్పుకొచ్చింది. 


Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?


Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్