టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'లైగర్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలమవుతోంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. నిజానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ సినిమానైనా ఆరు నెలల్లో పూర్తి చేసేస్తాడు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అలానే తీశారు. కానీ ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. 


Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!


లెజండ్ మైక్ టైసన్ ను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత అమెరికాలో షూటింగ్ కి పర్మిషన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇవి కాకుండా.. కరోనా ఒకటి. ఇలా పలు కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 22 నెలల తరువాత షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కూడా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తీసుకుంటుందని నమ్ముతున్నారు. 


మొన్నామధ్య 'రొమాంటిక్' సినిమా ఈవెంట్ లో 'లైగర్' సినిమాను పొగుడుతూ.. 'ఆగ్ లగా దేంగే' అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు. ఇదంతా కూడా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్. ఇక కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం అమెరికాలో వాలిపోయింది. లాస్ వేగాస్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. 


ఈ షూటింగ్ లో మైక్ టైసన్ తో కలిసి ఫైట్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ. సినిమాలో కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అయితే షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఛార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. 






Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్


Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో...  బాలకృష్ణ107వ సినిమా షురూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి