కన్నడ ప్రజల సూపర్ స్టార్ పునీత్ రాజకుమార్. ఆయన గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.జిమ్ చేసి వచ్చిన కొద్ది నిమిషాలకే ఆయన కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన నటించిన చివరి సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆయన భార్య అశ్విని ప్రకటించారు. ఆయన చివరగా నటించిన సినిమా ‘గంధన గుడి’. ఆ సినిమాకు నిర్మాతగా ఆయన భార్య అశ్విని వ్యవహరించారు. ఆ సినిమాను అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతి. కేవలం ఒక్కరోజు ముందే సినిమాను విడుదల చేయబోతున్నారు. పునీత్ చనిపోయాక విడుదలయ్యే రెండో సినిమా ఇది. ఇంతకుముందు జేమ్స్ సినిమా విడుదలైంది. అది భారీగా వసూళ్లను రాబట్టింది. 


పునీత్ భార్య అశ్విని సోషల్ మీడియాలో ఆ సినిమా పోస్టర్ ను పోస్టు చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘అప్పు చివరి చిత్రం ఇది. ఈ మూవీలో పునీత్ తన మీద ప్రేమ చూపించిన ఈ భూమి కోసం కర్ణాటకలోని అడవుల్లో అన్వేషణ చేస్తారు. ఈ మూవీ అక్టోబర్ 28న విడుదల కానుంది’ అని రాసుకొచ్చారామె. ఈ సినిమా టీజర్ గతేడాదే విడుదలైంది. ఇదే పునీత్ చివరి సినిమా. 


పునీత్ కేవలం 46  ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్టుతో మరణించారు. అప్పటికే సెట్స్ మీద చాలా చిత్రాలు ఉన్నాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. పునీత్ ను కన్నడలో అప్పు, యువరత్న, పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. 



Also Read :పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?