ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'లూసిఫర్' సినిమాతో దర్శకుడిగా మారారు. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్ లాంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన సమయంలోనే సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే పాండమిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సినిమాకి L2: ఎంపురాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 


ఇదిలా ఉండగా.. ఈరోజు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఎంపురాన్' సినిమా నుంచి మోహన్ లాల్ లుక్ ఒకటి రివీల్ చేశారు. ఇంటెన్స్ లుక్ తో మెప్పించారు మోహన్ లాల్. ఈసారి కథలో మోహన్ లాల్ బ్యాగ్రౌండ్, అతడు డాన్ గా ఎలా ఎదిగాడనే విషయాలను చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ తన రెండో సినిమా 'బ్రో డాడీ'లో కూడా మోహన్ లాల్ ను ముఖ్యపాత్ర కోసం తీసుకున్నారు. 


హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ తండ్రి కొడుకులుగా కనిపించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన 'లూసిఫర్', 'బ్రో డాడీ' రెండు సినిమాలను కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'లూసిఫర్' రీమేక్ గా తెరకెక్కుతోన్న 'గాడ్ ఫాదర్' షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తోన్న ఈ సినిమాలో నయనతార ముఖ్య పాత్రలో కనిపించనుంది. 


Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్