యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ ఆవిష్కరించారు. ప్రభాస్ పోస్టర్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే  చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. బ్లూ డ్రెస్ పై నెమలి పింఛం అలంకరణతో కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నట్టుంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టుంది.






రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విజువల్ గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఎక్కువ సమయం కేటాయించడంతో ఇంత సమయం తీసుకున్నారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించి గతంలో విడుదలైన ప్రభాస్, పూజాహెగ్డే పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.  ఈ సినిమా కోసం రెబస్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



రాధేశ్యామ్ తో పాటూ ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్”, “ప్రాజెక్ట్ కే” సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు చిత్రాలు కూడా విభిన్నమైన జోనర్లో తెరకెక్కుతుండటం విశేషం. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్ననాలుగు ప్రాజెక్టులతో పాటూ మరో ప్రాజెక్ట్ కూడా యాడ్ అవనుందని టాక్. సాహో తర్వాత సుజీత్ తో పని చేసేందుకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ఈ క్రేజీ కాంబో రిపీట్ కోసం యువీ క్రియేషన్స్‌ బేనర్‌ కూడా సిద్ధంగా వుందని టాక్. సాహోలో డార్లింగ్‌ను మాఫియా డాన్‌లా చూపించిన సుజిత్… ఈసారి మాత్రం సూపర్‌ కాప్‌ రోల్‌లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. రాధేశ్యామ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్‌. సలార్‌, ఆదిపురుష్‌ సెట్స్ మీదే ఉన్నాయి. త్వరలో ప్రాజెక్ట్-K కూడా పట్టాలెక్కుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక  కానీ సుజిత్‌కు డేట్స్ దొరికే ఛాన్స్ లేదు. మరి అప్పటి వరకూ సుజిత్ వెయిట్ చేస్తాడా.



ఏదేమైనా కృష్ణాస్టమి సందర్ఫంగా రిలీజ్ చేసిన పోస్టర్ భలే ఆకట్టుకుంటోంది...అందుకే అభిమానులంతా ఐ లవ్ యూ డార్లింగ్ అంటున్నారు.