ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'(Radheshyam). రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ప్రభాస్, పూజా హెగ్డే గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ అంటూ అన్ని ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. 


ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఆ కారణంగానే కొన్ని సన్నివేశాలను డూప్స్ తో తీయాల్సి వచ్చిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఇటీవల ముంబైలో జరిగిన 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో కూడా వీరిద్దరూ పెద్దగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. 


దీంతో అందరూ వీరి మధ్య గొడవ జరిగే ఉంటుందని భావించారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాహెగ్డే ఈ విషయంపై స్పందించింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అని, షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని.. ప్రతిరోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారని చెప్పింది. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేంటని ప్రశ్నించింది. ప్రభాస్ తో ఎవరూ మాట్లాడకుండా ఉండలేరని చెప్పుకొచ్చింది. 


Also Read: మీమ్ మేకర్స్ అండ్ ట్రోలర్స్ పై అనసూయ స్ట్రాంగ్ కౌంటర్