ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా మహిళలకు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సమాజంలో మహిళలు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని ప్రోత్సహించే వారితో పాటు ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారు. 


అలాంటి ట్రోలర్స్ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. 'విమెన్స్ డే అనగానే ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ సడన్ గా మహిళలకు గౌరవమివ్వడం గుర్తొస్తుందని.. కాకపోతే అది కొన్ని గంటల్లోనే ముగిసిపోతుందని.. కాబట్టి అలాంటివి నమ్మొద్దు. హ్యాపీ ఫూల్స్ డే' అంటూ రాసుకొచ్చింది. ఈ సొసైటీలో మహిళలకు మర్యాద ఇచ్చే వారే లేరన్నట్లుగా అనసూయ పోస్ట్ పెట్టింది. 


దీనికి కారణాలు లేకపోలేదు. అనసూయను ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ విషయంలో ఆమె రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే అనసూయ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఎవరో కొందరు ట్రోల్ చేస్తున్నారని.. అందరినీ అలానే చూడడం తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!


ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఈమె 'ఖిలాడి' సినిమాలో కనిపించింది. ఇప్పుడు 'పుష్ప' పార్ట్ 2లో నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. అలానే ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.