Pawan Kalyan About Akira Nandan And Aadhya: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి ఆయన బరిలోకి దిగారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజకీయాలు, సినిమాలతో పాటు కుటుంబ విషయాలను వెల్లడించారు.


ఆధ్య, అకీరాకు నేను ఇచ్చింది ఏంటంటే?


తన పిల్లలను అర్బన్ ఏరియాలో ఉండే సగటు ఉద్యోగి ఎలా పెంచుతాడో అలాగే పెంచినట్లు వెల్లడించారు. వాళ్లు ప్రయోజకులు అయ్యేందుకు చక్కటి ఎడ్యుకేషన్ అందించినట్లు చెప్పారు. “అర్బన్ ప్రాంతంలో ఉండే సగటు ఉద్యోగి పిల్లలు ఎలా పెరుగుతారో మా పిల్లలను కూడా అలాగే పెంచాం. వాళ్లకు నేను ఏం చెప్పానంటే.. మీకు చదువు చెప్పించగలను. కుదిరితే సినిమాలు చేసి ప్రాపర్టీ ఇస్తానన్నాను. వాస్తవానికి మా మధ్య ఆస్తుల గురించి డిస్కర్షన్ రాదు. నాకు ఓ ఇల్లు ఉండేది. దాన్ని అకీరా, ఆధ్య కోసం నా భార్యకు రాసి ఇచ్చాను. పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చాం అని కాదు. ఎంత నిలబెట్టుకుంటారు? అనేదే ముఖ్యం. మా నాన్న నాకు ఏం ఇవ్వలేదు. మా అన్నయ్య నాకు స్కిల్స్ నేర్పించారు. ధైర్యం ఇచ్చారు. దాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగాను. మంచి పురోగతి సాధించాను. నేను కూడా నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఎడ్యుకేషన్ అందించాను” అని వివరించారు.


ఆగిపోయిన సినిమాలు మళ్లీ ప్రారంభం


కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఎన్నికలు పూర్తి కావడంతో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ మొదలుకానున్నాయి. ప్రస్తుతం సుజీత్ తో కలిసి ‘ఓజీ‘, హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు‘ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘ఓజీ‘ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘హరి హర వీరమల్లు‘ కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి తిరిగి రానునన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ‘ఓజీ’ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు దర్శకుడు సుజీత్. ‘ఓజీ‘ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్‘, ‘హరి హర వీరమల్లు‘ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Read Also: పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్‌ పోస్తానని బెదిరించారు..