పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్(Krish) 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu) అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలనుకున్నారు. దానికి తగ్గట్లుగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. 


అక్టోబర్ 17 నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరింత ఆలస్యమయ్యేలా ఉంది. విశాఖలో జరిగిన పరిణామాలకు నిరసనగా పవర్ స్టార్ వైసీపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. దీని కారణంగా 'హరిహర వీరమల్లు' షెడ్యూల్ దెబ్బతింది. ఇప్పుడు నవంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియని పరిస్థితి. 


పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఏడాది పూర్తయ్యేలోపు 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఆయన ఎంత త్వరగా సినిమా చేద్దామనుకున్నా.. పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. ప్రస్తుతమైతే 'హరిహర వీరమల్లు' టీమ్ పవన్ కోసం ఎదురుచూస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


సినిమా రిలీజ్ అప్డేట్:
మొదట ఈ దసరాకి సినిమా వస్తుందన్నారు. ఆ తరువాత 2023 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) రిలీజ్ డేట్ విషయాన్ని బయటపెట్టారు.


ఈ సినిమాతో పాటు తమిళ సినిమా 'వినోదయ సీతమ్'(Vinodhaya Sitham) రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. 


పరశురామ్ కి ఛాన్స్ ఇస్తారా..?


మహేష్ బాబు(Mahesh Babu)తో 'సర్కారు వారి పాట' సినిమా తీసిన పరశురామ్.. ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించలేదు. ఈ క్రమంలో పవన్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. పరశురామ్ కథ గనుక పవన్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా గ్యారెంటీ. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నారు. కథ మొత్తం పూర్తయ్యాక పవన్ కి వినిపిస్తారు. మరి పరశురామ్ కి పవన్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి!


Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?