హైదారాబాద్‌ మాధాపూర్‌ ల్యాండ్‌ కేసు మరో మలుపు తిరిగింది. మాదాపూర్‌లోని సర్వే నెంబర్ 10లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్‌తో బెదిరింపులకు దిగారు. నిర్మాణంలో ఉన్న భూమిలో తనకు కాంట్రాక్ట్ దక్కలేదన్న కోపం పెంచుకున్న సంజీవ్ రెడ్డి ఇలా ప్లాన్ చేశారు. కాంట్రాక్ట్ చేస్తున్న సుబ్బయ్యపై గన్‌తో బెదరింపులకు దిగాడు. 


తనకు దక్కలేదన్న కోపంతో సుబ్బయ్యపై గన్‌ పెట్టి బెదిరింపులకు దిగాడు. అక్కడ వర్క్‌ చేయకుండా ప్లేస్‌ ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ వివాదంతో నిర్మాత సురేష్‌ బాబుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చారన్నారు. సంజీవ్‌రెడ్డిని అరెస్ట్ చేసి గన్ ను పోలీసులు సీజ్‌ చేశారు. 


 మాదాపూర్‌లోని సర్వే నెంబర్ 10లో రియల్టర్ సంజీవ్ రెడ్డి గన్ తో బెదిరింపులకు దిగాడు. సంజీవ్‌ రెడ్డి కావాలనే ప్లాన్ చేసుకొని ఇదంతా చేస్తున్నారని సుబ్బయ్య ఆరోపిస్తున్నారు. పక్కన ఉన్న ల్యాండ్‌ను సంజీవ్ రెడ్డి అభివృద్ధికి తీసుకున్నారని... పనిలో పనిగా ఈ ల్యాండ్‌ కూడా తనకే కావాలంటూ గతంలో కోరారన్నారు. దీనికి ఆ ల్యాండ్‌ ఓనర్‌ ఇవ్వడానికి నిరాకరించారట. తర్వాత ఆ ల్యాండ్‌ తనకు అప్పగించారని వివరించారు సుబ్బయ్య. 


ఎప్పుడైతే తనకు ఈ ల్యాండ్‌ డెలవప్‌మెంట్‌కు ఇచ్చారో... అప్పటి నుంచి సంజీవ్‌ రెడ్డి కక్ష పెంచుకున్నారని సుబ్బయ్య తెలిపారు. తనపై కక్ష పెట్టుకొని రాత్రి వెపన్ తీసుకొని కాల్పులు చేయాలని చూశారన్నారు. గన్‌లోడ్ చేసుకొని బెదిరింపులకు దిగడంతో అడ్డుకున్నామన్నారు. 


తనకు రియల్టర్ సంజీవ్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందన్నారు సుబ్బయ్య. ఈ ల్యాండ్‌కి నిర్మాత సురేష్ బాబుకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సురేష్ బాబు ల్యాండ్‌ను సంజీవ్ రెడ్డి డౌల్ప్‌మెంట్‌కి తీసుకున్నారని... అందుకే వారి పేరును ఉపయోగించుకుంటున్నారన్నారు. సురేష్ బాబుతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. సురేష్ బాబుకి కూడా సంజీవ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు.