టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రీసెంట్ గా నటించిన సినిమా ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. మూవీ విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేయడం ప్రారంభించింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలో సినిమా చూసిన వారు పాజిటివ్ గా స్పందిస్తున్నారట. దీంతో మూవీ టీమ్ సినిమా ఫలితం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరు అనేది కూడా ముందే తెలిసిపోయింది. 


‘సామజవరగమన’ ఓటీటీ పార్ట్నర్ గా ‘ఆహా’


ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు వేయడం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ సినిమాకు కూడా విడుదలకు మూడు రోజుల ముందే ప్రీమియర్ షో లను వేశారు. తెలుగు మీడియా కోసం హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ లో మూవీను స్క్రీనింగ్ చేశారు. అయితే ఈ మూవీకు ఓటీటీ పార్ట్నర్ గా ఆహా ను అఫీషియల్ గా ప్రకటించారట. దీంతో ఈ మూవీ ఆహా లోనే స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. ఆయన గతంలో నటించిన ‘అల్లూరి’ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కొంతమంది ఫ్యామిలీ మూవీ ఆడియన్స్ కు ఈ సినిమా ప్రీమియర్ షో వేసి చూపించారట. సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా బానే ఉందని రివ్య్యూ ఇస్తున్నారట ఆడియన్స్. దీంతో మూవీ టీమ్ ఈ మూవీపై ఫుల్ కాన్పిడెన్స్ తో ఉందట. 


ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు ‘సామజవరగమన’


ఇప్పటికే ప్రీమియర్ షో లకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. హీరో శ్రీవిష్ణుకి కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. హీరో శ్రీవిష్ణు చాలా కాలం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేశాడు. గతేడాది యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ తో అలరించిన శ్రీవిష్ణు ఈసారి పక్కా కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటిస్తోంది. జూన్ 29 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పూర్తి స్థాయిలో మూవీ విడుదల అయిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు నటించారు.  హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు.


Also Read: విడుదలకు ముందే అదరగొడుతోన్న నిఖిల్ 'స్పై' - ఇదే ఫస్ట్ టైమ్!