Just In





Raj Tarun Shivani Rajasekhar: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట
డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట! అసలు, ఆ కథ ఏంటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

యువ హీరో రాజ్ తరుణ్, రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివానీకి పెళ్ళంట! అది రియల్ లైల్లో కాదు... రీల్ లైల్లో! ఇద్దరూ కలిసి 'అహ నా పెళ్ళంట' అని అంటున్నారు. అవునా? అసలు, ఆ కథ ఏంటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
Raj Tarun and Shivani Rajasekhar paired up for Aha Naa Pellanta: 'ఉయ్యాలా జంపాలా' నుంచి 'స్టాండప్ రాహుల్' వరకు... తెలుగు ప్రేక్షకులను సినిమాలతో అలరించిన రాజ్ తరుణ్, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆ సిరీస్ టైటిల్ 'అహ నా పెళ్ళంట' (Aha Naa Pellanta Web Series). ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్. జీ 5 ఓటీటీ కోసం రూపొందుతోన్న ఒరిజినల్ సిరీస్ ఇది. మంగళవారం సిరీర్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ లాంటి వీడియో ఒకటి విడుదల చేశారు.
Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'
రాజ్ తరుణ్, శివాని... ఇద్దరికీ ఇదే తొలి వెబ్ సిరీస్. శివాని నటించిన 'అద్భుతం', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి. అయితే, ఆమె ఇప్పటి వరకు వెబ్ సిరీస్ చేయలేదు. 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్లో తాగుబోతు రమేష్, 'గెటప్' శీను, హర్షవర్ధన్, మధునందన్, భద్రం తదితరులు ఇతర తారాగణం.