బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఓటీటీలో విపరీతమైన ఆదరణ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అందుకు ఇదొక ఉదాహరణ.‌ సూపర్ స్టార్ కాస్ట్ లేదు. కానీ, ప్రేక్షకులకు తెలిసిన హీరో హీరోయిన్లు ఉన్నారు.‌ మంచి మసాలా సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన మెసేజ్ ఉండడంతో 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా ఓటీటీ వేదికల్లో దుమ్ము దులుపుతోంది. 


50 రోజుల్లో 70 మిలియన్ వ్యూస్!
'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు చైతన్య రావు.‌ 'కుమారి 21ఎఫ్' సినిమా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్, రెగ్యులర్ సినిమా ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ హెబ్బా పటేల్. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. 


జూన్ 21న 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఆ తర్వాత రెండు నెలలకు ఆగస్టు 27న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైమ్ వీడియోలో ఈ సినిమా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉంది.


బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో విడుదల చేశారు. ఫస్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన స్పందన చూసి ఆ తర్వాత ఆహా ఓటీటీలో  కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆ ఓటీటీ వేదికలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఓటీటీ వేదికల్లో విడుదలైన 50 రోజులలో 70 మిలియన్ వ్యూస్ అందుకుంది.‌ థియేటర్లలో కంటే ఓటీటీల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది.


Also Read: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?



'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' కథ ఏమిటి?
'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఆయన పాటలకు మంచి స్పందన లభించింది. బాల రాజశేఖరుని, కేకేఆర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సుహాసిని, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.


ప్రేమ, పెళ్లి నేపథ్యంలో 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా తెరకెక్కింది. ఓ కొత్త జంట కాపురంలో కలహాలు వస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక రిసార్ట్ కు వెళతారు. అక్కడ ఒకరి మనసులో భావాలను మరొకరు ఎలా తెలుసుకున్నారు? ఇద్దరు తమ తమ ఆలోచనలు ఎలా పంచుకున్నారు? మనస్పర్థలు తొలగించుకుని మళ్ళీ ప్రేమగా తిరిగి ఇంటికి ఎలా వచ్చారు? అనేది సినిమా. ప్రస్తుత తరుణంలో, ఈ కాలం జంటల మధ్య విడాకులు ఎక్కువ అవుతున్న తరుణంలో ఈ తరహా సినిమా సందేశం ఇస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొంతమందికి ఆ సందేశం నచ్చితే... మరి కొంతమందికి సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు నచ్చుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తూ ఉండడంతో ట్రెండ్ అవుతోందీ సినిమా.


Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య