మరికొన్ని గంటలో 'దేవర' మాస్ ఫెస్ట్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని విధంగా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగులో ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉండగా, హిందీ బెల్ట్ లో కూడా మరింతగా బజ్ క్రియేట్ చేయడానికి ఉన్న అవకాశాలు అన్నింటిని వాడుకుంటుంది 'దేవర' చిత్ర బృందం. హిందీ పాపులర్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సందడి చేసిన ఎపిసోడ్ రిలీజ్ డేట్ ను తాజాగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. 


సౌత్ నార్త్ కలిస్తే మజా డబుల్ 
జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండవ భారీ బడ్జెట్ మూవీ దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. వీరిద్దరికి ఇదే తెలుగులో ఫస్ట్ మూవీ. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'దేవర' ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా, సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. 2.50 గంటల రన్ టైంతో సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేవర టీం నార్త్ లో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పాపులర్ టాక్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు. 


జాన్వీ ఫుడ్ కష్టాలు.. తారక్, సైఫ్ ఫన్నీ సెటైర్లు 


ఎన్టీఆర్ కు గత చిత్రం ఆర్ఆర్ఆర్ తో హిందీలో కూడా మంచి ఫ్యాన్ బేస్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హిందీ బెల్ట్ లో దేవర మూవీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతోంది దేవర టీం. అచ్చం రాజమౌళి లాగే కపిల్ శర్మ షోలో తాజాగా ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో బుల్లితెరపై రికార్డులను తిరగరాస్తుంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను కపిల్ శర్మ ఇంటర్వ్యూ చేసే విధానానికి ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కొత్త సీజన్ సెప్టెంబర్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. అందులో భాగంగానే ఈ షోలో దేవర టీం నుంచి ఎన్టీఆర్, జాన్వి , సైఫ్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోను పంచుకుంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఎన్టీఆర్ తన పంచ్ డైలాగ్స్, జోక్స్ తో కపిల్ శర్మ షోకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది అని అనౌన్స్ చేసింది. 


Also Readఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ






ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్...
ఈ షోలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. "నార్త్ లో నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి" అని తారక్ చెప్పగా, వెంటనే "నాకు దక్షిణాది హీరోయిన్లు అంటే శ్రీదేవి ఇష్టం" అంటూ సైఫ్ పంచ్ వేశారు. ఆ తర్వాత జాన్వి కపూర్ ఫుడ్ గురించి మాట్లాడింది. "ఇక్కడ ఆలూ పరోటా తినేదాన్ని. అక్కడికి వెళ్ళాక ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ తినాల్సి వచ్చింది" అంటూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ నడిచింది. "ఇంటి నుంచి ఫుడ్ పంపించేవాడిని" అంటూ ఎన్టీఆర్, జాన్వి కపూర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలలో చెప్పారు. 


Also Readచిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల