లెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. శ్రీకాంత్, మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, థియేటర్‌లలో ప్రేక్షకాధరణకు నోచుకోలేదు. ఫ్లాప్ టాక్ రావడంతో ఓటీటీలో విడుదల కూడా అనుమానమేనని సందేహాలు నెలకొన్నాయి. మీమ్ మేకర్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేశారు.


ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. మే 17 నుంచి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రానికి ఇళయ రాజ సంగీతం అందించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా, మోహన్ బాబు స్క్రీన్‌ప్లే అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి.


Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!



Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ