Dulquer Salmaan Kaantha OTT Release Date Locked : దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వచ్చినా వాటన్నింటికీ తాజాగా చెక్ పడింది. 

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'కాంత' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా రిలీజ్ డేట్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి మూవీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. సెల్వమణి సెల్వరాజ్ మూవీకి దర్శకత్వం వహించగా... దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు.

Continues below advertisement

వీరితో పాటు రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా, దుల్కర్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మించారు.

Also Read : 'అఖండ 2' రిలీజ్‌పై వీడని సస్పెన్స్! - ప్రాబ్లమ్ ఇంకా సాల్వ్ కాలేదా?... ఆ తేదీల్లో రిలీజ్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

స్టోరీ ఏంటంటే?

అయ్య (సముద్రఖని) ఫేమస్ డైరెక్టర్. తన తల్లి జీవిత కథ ఆధారంగా 'శాంత' అనే సినిమా తీయాలనుకుంటాడు. తన ప్రియ శిష్యుడు టీకే మహాదేవన్ (దుల్కర్ సల్మాన్) ను అందులో హీరో. ప్రేక్షకులు దేవుడిగా మహాదేవన్‌ను కొలుస్తూ 'నట చక్రవర్తి' అనే బిరుదు ఇస్తారు. అయితే, అయ్యకు, మహాదేవన్‌కు మధ్య ఊహించని విధంగా శత్రుత్వం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. దీంతో 'శాంత' సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.

కొన్నేళ్ల తర్వాత సినిమా మళ్లీ ప్రారంభమైనా తాను చెప్పిన క్లైమాక్స్‌తోనే మూవీ తీయాలనే కండీషన్ మీద చేయడానికి ఒప్పుకొంటాడు మహాదేవన్. టైటిల్ 'శాంత' నుంచి 'కాంత'కు మార్చేస్తాడు. ఎన్ని మార్పులు చేసినా ఎన్ని కండీషన్స్ పెట్టినా తన తల్లి కథను వెండితెరపై చూడాలనే కోరికతో అయ్య... అన్నింటికీ అంగీకరిస్తాడు. అయితే, సెట్‌లో మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండానే షూటింగ్ సాగిపోతుంటుంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రయత్నిస్తుంటుంది. మూవీ కంప్లీట్ అవుతుందనుకునే టైంలో టీంలో ఒకరు హత్యకు గురవుతారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం రేగుతుంది. ఆ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. అసలు గురుశిష్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఆ హత్య చేసింది ఎవరు? కాంత మూవీ రిలీజ్ అయ్యిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.