Ambajipeta Marriage Band OTT Release Update: ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’.. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. క్రిటిక్స్‌ నుంచి కూడా ప్రశంసలు అందుకున్న సినిమా. క‌లెక్ష‌న్స్ లో కూడా టాప్ లోనే నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. ఓటీటీలో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? ఏ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందా? అని అనుకుంటుండ‌గా.. గుడ్ న్యూస్ చెప్పింది 'ఆహా'. 'క‌మింగ్ సూన్' అంటూ ట్వీట్ చేసింది. 


మార్చి 1న రిలీజ‌య్యే అవ‌కాశం?


'క‌మింగ్ సూన్' అని మాత్ర‌మే ట్వీట్ చేసింది 'ఆహా'. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క‌చ్చితంగా చెప్ప‌లేదు. అయితే, మార్చి 1న ఓటీటీలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ గా మారింది. 


క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టిన నటుడు సుహాస్‌. హీరోగా కూడా మంచి గుర్తింపు పొందాడు. 'కలర్‌ ఫొటో', 'రైటర్‌ పద్మభూషణ్‌' లాంటి సినిమాల్లో న‌టించాడు. అవి కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. హిట్ కొట్టాయి. హీరోగా మాత్ర‌మే కాదు.. నెగిటివ్‌ రోల్స్‌లోనూ మెప్పించాడు సుహాస్. 'హిట్‌: ది సెకండ్‌ కేసు'లో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు ఈ యాక్ట‌ర్. మరోవైపు హీరోలకు స్నేహితుడి పాత్ర‌ల్లో కూడా అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్‌ హీరోగా నటించిన సినిమా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఈ సినిమాని దుశ్యంత్ కటికినేని డైరెక్ట్ చేశాడు. శివాని నాగరం హీరోయిన్. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. 


ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ మంచి టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. క‌లెక్ష‌న్స్ విష‌యంలో కూడా దూసుకెళ్లింది. ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.2.28 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఒక చిన్న హీరో సినిమా ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో వసూళ్లు రాబ‌ట్టం సాధారణ విషయం కాదు అంటూ గ‌తంలో సినిమా టీమ్ ప్ర‌క‌టించింది.


ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొన‌సాగించింది. ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్, ట్రైల‌ర్ రిలీజైన‌ప్ప‌టి నుంచే భారీగా అంచ‌నాలు పెరిగాయి. ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదీ కాకుండా రిలీజైన టైంలో.. థియేట‌ర్ల‌లో సినిమాలు కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డం, పెద్ద సినిమాల సందడి, ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్‌ మరింత పెరిగాయ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.


ఇక ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించారు. విలేజ్ డ్రామాలో సోషల్ మెసేజ్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు దుశ్యంత్. ఈ సినిమాలో సుహాస్ అక్క‌గా న‌టించిన ఫిదా ఫేమ్ శ‌ర‌ణ్య‌, హీరోయిన్‌గా నటించిన శివానీ పర్ఫార్మెన్స్‌లు కి కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. వీరి న‌ట‌న బాగుంది అంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.


Also Read: బేబీ బంప్‌తో భూమా మౌనిక - మంచు మనోజ్ లవ్లీ రిప్లై