డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ 'పరంపర' ఈరోజు నుంచి ప్రసారమవుతోంది. ఇందులో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని నటుడు నవీన్ చంద్ర వెల్లడించారు.


''ఒక సంవత్సరం కృషి చేసి.. కోవిడ్ సమయంలో ఈ సిరీస్ ను షూట్ చేశాం. ఇంతమంది క్యాస్టింగ్ తో పని చేసి, సిట్యుయేషన్ ను చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆర్కా మీడియా, హాట్ స్టార్ టీమ్. వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలి. 'పరంపర' అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. యాక్షన్, డ్రామా, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది'' అంటూ చెప్పుకొచ్చారు నవీన్ చంద్ర.


మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథ అని.. పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశానని రైటర్ హరి ఏలేటి చెప్పుకొచ్చారు. 'పరంపర' అనేది ఐదు సినిమాల కంటెంట్ అని.. ప్రొడక్షన్ పరంగానే కాదు.. రైటింగ్ పరంగా, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ప్రతీదానికి ఐదు రెట్లు ఎక్కువ ఎఫర్ట్ ని పెట్టామని చెప్పారు నిర్మాతలు. 






Also Read: 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ టాక్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు..


Also Read:2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..


Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?


Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి