ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా 'అంటే సుందరానికీ' సినిమాను పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాని. ప్రస్తుతం ఆయన 'దసరా' అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 


ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ కథ మొత్తంలో గ్రామంలో జరుగుతుందట. దానికోసం హైదరాబాద్ లో ఓ విలేజ్ సెట్ వేస్తున్నారు. 


ఈ ఒక్క సెట్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని సమాచారం. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో అంటరానితనం కాన్సెప్ట్ కూడా ఉంటుందని టాక్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు.  






Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..


Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి