నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో 'ఆదిత్య 369' (Aditya 369) ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఆయన వందో సినిమాగా అదే చేస్తారని వినిపించింది. అయితే... కుదరలేదు అనుకోండి! ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే సమయం వచ్చిందని బాలకృష్ణ మాటలను బట్టి అర్థం అవుతోంది.

  


'ఆదిత్య 999 మాక్స్' కథ బాలకృష్ణదే!
Balakrishna Pens Aditya 999 Max Script : 'ఆదిత్య 369' సీక్వెల్‌కు 'ఆదిత్య 999 మాక్స్' టైటిల్ ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... ఆ చిత్రానికి బాలకృష్ణ స్వయంగా కథ రాశారు. అవును... 'ఆదిత్య 999 మాక్స్' కథ బాలయ్యే రాశారు. ఈ విషయాన్ని శర్వానంద్, అడివి శేష్‌తో 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో వెల్లడించారు.
    
వచ్చే ఏడాది సెట్స్ మీదకు!
Aditya 999 Max will be launched in February 2023 : వచ్చే ఏడాది 'ఆదిత్య 999 మాక్స్' సెట్స్ మీదకు వెళ్లనుందని, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలకృష్ణ వెల్లడించారు. మరో నాలుగు నెలల తర్వాత... ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని వినికిడి. 



'ఆదిత్య 999 మాక్స్'తో మోక్షజ్ఞను కథానాయకుడిగా బాలకృష్ణ పరిచయం చేస్తారా? లేదా? అనేది కొన్ని రోజులు ఆగితే స్పష్టత వస్తుంది. మొత్తం మీద... కల్ట్ క్లాసిక్‌కి సీక్వెల్ రావటం పక్కా అన్నమాట. ఇప్పుడు ఈ విషయమే బాలయ్య, నందమూరి అభిమానులను  ఖుషీ చేస్తోంది.  


టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన 'ఆదిత్య 369'కు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం. ప్రస్తుతం సింగీతం వయసు దృష్ట్యా 'ఆదిత్య 999 మాక్స్'కు ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువ. వేరొకరి చేతిలో బాలకృష్ణ దర్శకత్వ బాధ్యతలు పెడతారా? లేదంటే ఆయనే చేపడతారా? అనేది చూడాలి.


Also Read : వదిలేస్తే వరస్ట్‌గా చేస్తున్నారేంటి? - ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్



Balakrishna Upcoming Movie : ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శకుడు గోపీచంద్ మలినేనితో 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie) చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండిటి తర్వాత 'ఆదిత్య 999 మాక్స్' స్టార్ట్ కావచ్చు. దర్శకులు పరశురామ్, వెంకటేష్ మహా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.