Rangabali Movie: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగబలి’. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జులై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది. ముందు నుంచీ మూవీ టీమ్ ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే కమెడియన్ సత్యతో కలసి ఓ ఇంటర్వ్యూ చేశారు హీరో నాగశౌర్య. ఆ ఇంటర్వ్యూలో కొంత మంది ప్రముఖ జర్నలిస్ట్ లను ఇమిటేట్ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఆ ఇంటర్వ్యూ కు సంబంధించిన మొదటి పార్ట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజాగా రెండో పార్ట్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


రెండో పార్ట్ కూడా రిలీజ్...


‘రంగబలి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ వినూత్న ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది మూవీ టీమ్. కమెడియన్ సత్యతో కలసి హీరో నాగశౌర్య చేసిన ఆ వివాదాస్పద ఇంటర్వ్యూ రెండో పార్ట్ ను కూడా త్వరగానే రిలీజ్ చేశారు మేకర్స్.  ఇందులో కమెడియన్ సత్య నాగశౌర్యను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. ఈసారి పార్ట్ లో కూడా ప్రముఖ జర్నలిస్ట్ లను ఇమిటేట్ చేస్తూ ఇంటర్వ్యూ చేశారు సత్య. అందులో ‘ఇట్లు మీ డ్రాఫర్’, ‘నరేష్ మండేటి’, ‘ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ విత్ వల్లి’ పేర్లతో కొందరు ప్రముఖ జర్నలిస్ట్ ల ఇంటర్వ్యూలను స్పూఫ్ చేస్తూ ఇంటర్వ్యూ చేశారు సత్య. ఈ పార్ట్ కూడా చాలా సెటైరికల్ గా ఫన్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూను నిలిపివేయాలని మొదట్లో ఒత్తిడులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఇంటర్వ్యూకు సంబధించి రెండు పార్ట్ లను విడుదల చేశారు మేకర్స్.


ఈసారైనా నాగశౌర్యకు హిట్ వచ్చేనా?


హీరో నాగశౌర్యకు ఈ ‘రంగబలి’ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచే మూవీటీమ్ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. ప్రమోషన్స్ ను కూడా అతే రేంజ్ లో చేస్తున్నారు. హీరో నాగశౌర్య కూడా ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ మూవీ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడం అలాగే ప్రమోషన్స్ వీడియోలు బాగా వైరల్ అవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మరి తెరపై మూవీలో ఎలాంటి కామెడీ ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తుండగా యుక్తి తరేజా హీరోయిన్ గా చేసింది. కమెడియన్ సత్య, గోపరాజు రమణ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: పెళ్లికి సిద్ధమవుతోన్న ‘బిగ్ బాస్’ కిస్సింగ్ బ్యూటీ ఆకాంక్ష పూరి? ఆ సింగర్‌తో రిలేషన్?