Naa Saami Ranga is going to be Akkineni Nagarjuna mass jathara: వెండితెరపై మాసీగా కనిపించడంలో, మాస్ సినిమాలు చేయడంలో కింగ్ అక్కినేని నాగార్జున స్టైల్ సపరేట్. 'మాస్', 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలు ఈ జనరేషన్ కూడా చూశారుగా! ఇప్పుడు మరోసారి మాంచి రూరల్ మాస్ సినిమాతో సంక్రాంతికి థియేటర్లలో ఆయన సందడి చేయబోతున్నారు.


Naa Saami Ranga Teaser Released, Watch Here: అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతోన్న మాస్ ఎంటర్‌టైనర్ 'నా సామి రంగ'. ఈ సినిమాతో ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ చిత్ర సమర్పకులు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్‌ చూస్తే... నాగార్జున మాస్‌ జాతర మామూలుగా ఉండదని అర్థం అవుతోంది.  


టీజర్ ప్రారంభంలో మామిడి తోటలో నాగార్జున మాస్ ఫైట్ చూపించారు. టీజర్ చివరలో కత్తి నోటిలో పెట్టుకుని నాగార్జున చేసిన మాస్ ఫైట్ కూడా మామూలుగా లేదు. ఫైట్స్ మాత్రమే కాదు... సినిమాలో రొమాంటిక్ & లవ్లీ సీన్లు కూడా ఉన్నాయి. అయితే... హీరో హీరోయిన్లు ఎందుకు మాట్లాడుకోవడం లేదనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎనిమిదేళ్ల క్రితం వాళ్ళ మధ్య ఏం జరిగింది? అనేది కొన్ని సీన్లలో చూపించారు. అయితే... గొడవ ఏమిటో చెప్పలేదు. 


Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!



ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ కథానాయిక. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఆమె తొలి తెలుగు సినిమా. కొన్ని రోజుల క్రితం నాగార్జున, ఆషికాపై తీసిన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఆ పాటకు ఆస్కార్ అవార్డు విజేతలు ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల ఆలపించారు. విజయ్ బిన్నీతో పాటు మ్యాగీ కొరియోగ్రఫీ అందించారు. తాజాగా అంజి పాత్రలో నటిస్తున్న 'అల్లరి' నరేష్ ఫస్ట్ లుక్, ఆయన క్యారెక్టర్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!  


Naa Saami Ranga release on Sankranti 2024: ప్రస్తుతం హైదరాబాద్‌లో 'నా సామి రంగ' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.


నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి. నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకత్వం: విజయ్ బిన్నీ.