సర్కారు వారి పాట (Sarkaru vari paata) సినిమా సైలెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మేలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అదనపు ఆకర్షణలా కొత్త పాటను జోడించింది ఆ చిత్ర యూనిట్. సినిమా విడుదలైన అయిదారు రోజులకు ఈ కొత్త  పాటను జత చేసింది. ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ పాటలో కీర్తి సురేష్, మహేష్ బాబు మరింత అందంగా మెరిశారు. డ్యాన్సులతో అదరగొట్టారు. ‘మురారి వా’అనే ఈ పాటకు మహేష్ అభిమానులు స్టెప్పులేయడం ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా విడుదలైంది కాబట్టి ఇక దుమ్మురేపడం ఖాయం. అదిరే స్టెప్పులు, బ్యాగ్ గ్రౌండ్ తో పాట మళ్లీ మళ్లీ చూసేలా ఉంది.ఇందులో హీరోహీరోయిన్లు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. ప్రత్యేకంగా వేసిన సెట్లో పాటను చిత్రీకరించారు. మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా వేసిన స్టెప్పులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఎడిటింగ్ లో భాగంగా తీసేసిన ఈ పాటను మళ్లీ థియేటర్ ప్రదర్శనలో యాడ్ చేయడం వెనుక ఉద్దేశం మళ్లీ ప్రేక్షకులను సినిమాకు రప్పించడమే.  


బ్యాంకింగ్ వ్యవస్థపై తీసిన ఈ సినిమా సామాన్యుడి పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉండడంతో సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా దూకుడు కన్నా అధికంగా వసూళ్లు సాధించినట్టు ప్రిన్స్ మహేష్ ఇప్పటికే చెప్పారు. భారీ వసూళ్లు సాధించిన సర్కారు వారి పాట ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే  అది అద్దె ప్రాతిపదికన అవుతోంది. త్వరలో సాధారణ ప్రైమ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 


ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్, మైత్రీ మూవీ బ్యానర్లపై మహేష్ బాబు స్వయంగా నిర్మించిన సినిమా ఇది. థమన్ సంగీతం అందించారు. మురారి వా పాటను అనంత శ్రీరామ్ రచించారు. 




Also Read: ఇండియన్ రెస్టారెంట్‌లో హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఒక్క నైట్ డిన్నర్‌కు 48 లక్షలు


Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?