గత శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే మరోపక్క మాత్రం సక్సెస్ టూర్స్, మీటింగ్ పెడుతున్నారు. తమ సినిమా సూపర్ హిట్ అంటూ యాడ్స్ కూడా ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో అన్ని టాక్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు ఇలానే చేస్తున్నారు. అదే అతి అనుకుంటే.. ఇప్పుడు ఈ ప్లాప్ సినిమాలు తీసిన దర్శకనిర్మాతల మాటలు కోటలు దాటుతున్నాయి. రీసెంట్ గా ఎమ్మెస్ రాజ్ తను తీసిన '7 డేస్ 6 నైట్స్' గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాను క్లాసిక్ మూవీ 'శంకరాభరణం'తో పోల్చారు. 


'శంకరాభరణం' సినిమా విడుదలైన కొత్తల్లో ఫ్లాప్ అయిందట. ఆ తరువాత మౌత్ టాక్ తో క్లాసిక్ హిట్ గా నిలిచిందట. తన సినిమాకి కూడా అలాంటి మౌత్ టాక్ మొదలైందనేది ఎమ్మెస్ రాజు మాట. ఈ సినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారని చెబుతున్నారాయన. ఇంటికి వెళ్లిన తరువాత కూడా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని తన సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. 


ఈ సినిమాతో పాటు విడుదలైన 'సమ్మతమే' సినిమాకి కూడా ప్లాప్ టాకే వచ్చింది. కానీ ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం మాత్రం తమ సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. గతంలో ఇతడు చేసిన 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాకు కూడా ఇలానే మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చిందట. ఆ తరువాత సినిమా బ్లాక్ బస్టర్ అయిందని.. ఇప్పుడు 'సమ్మతమే' విషయంలో కూడా అదే జరుగుతుందని అంటున్నారు. ఇక 'చోర్ బజార్' సినిమా గురించి ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఈ సినిమాతో తను మాస్ హీరోగా జనాల్లోకి వెళ్లిపోయానని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో కూడా సినిమాలకు నెగెటివ్ టాక్ వస్తే లైట్ తీసుకునేలా లేరు మన మేకర్స్. 


Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!


Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్