టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత.. కొన్నాళ్లుగా చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఏమైందా..? అని టెన్షన్ పడ్డారు. ఆమె స్కిన్ డిసీజ్ తో బాధ పడుతుందని.. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ సమంత వాటిపై స్పందించలేదు. ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా తనకేం జరిగిందో వెల్లడించింది సమంత.


కొన్ని నెలలుగా మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది సమంత. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత అందరికీ విషయం చెప్పాలనుకున్నానని కానీ తను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సమంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


సెలబ్రిటీలు సైతం సమంతకు ధైర్యం చెబుతూ కొన్ని పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, రామ్ పోతినేని, రాశిఖన్నా ఇలా చాలా మంది సమంత కోసం పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. సమంత అనారోగ్యంపై రియాక్ట్ అయ్యారు. 'డియర్ సామ్' అంటూ ఆమెకి ధైర్యం చెబుతూ కొన్ని లైన్స్ రాశారు. 


Megastar Chiranjeevi's Inspiring words to Samantha:''మన జీవితాల్లో కాలానుగుణంగా సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మనలోని శక్తిని వెలికితీయడానికి ఇలాంటి సవాళ్లు ఉపకరిస్తుంటాయి. నువ్వు ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ సవాల్ ను కూడా నువ్ అధిగమించగలవని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ కష్ట సమయంలో నువ్ ధైర్యంగా, దృఢవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దైవశక్తి కూడా నీ వెన్నంటే ఉంటుంది'' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. ఇది చూసిన సామ్.. చిరుకి థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చింది. 






ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన 'యశోద' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను హరి, హరీష్ అనే దర్శకులు తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్(Sridevi Movies) బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. నవంబర్ 11న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో గర్భవతి రోల్ చేశారు సమంత. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసే పోరాటాన్ని చూపించారు. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 


Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్