మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. తమిళ్ సినిమా ‘వేదాళం’కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రఘుబాబు, మురళీ శర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ప్రగతి సహా పలువురు నటీనటులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అభిమానులు బాగా ఆకట్టుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


భోళాశంకర్’ షూటింగ్ పూర్తి- ట్వీట్ చేసిన దర్శకుడు


తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మెహర్ రమేష్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ‘భోళాశంకర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “‘భోళాశంకర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గడిచిన కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ కోసం కష్టపడిన నటీనటులు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాలు, పాటల విడుదల త్వరలోనే మొదలవుతుంది” అని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.  






హ్యాట్రిక్ హిట్ ఖాయం అంటున్న అభిమానులు


మెగాస్టార్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్లు అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘భోళాశంకర్’ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకోవాలని భావిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   


ఆగస్టు 11ప్రపంచ వ్యాప్తంగా 'భోళా శంకర్' విడుదల


‘భోళాశంకర్’ మూవీని ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్  ఇప్పటికే వెల్లడించింది. విడుదల తేదీ మార్చే అవకాశం ఉందని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేసింది. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.


Read Also: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial