అడివి శేష్ నటించిన 'మేజర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'మేజర్' టీమ్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాని పొగుడుతూ.. ట్విట్టర్ లో ఓ లెటర్ షేర్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. 


'మేజర్ సినిమా కాదు.. ఒక ఎమోషన్. గొప్ప హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కథను చాలా షార్ప్ గా చూపించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. మహేష్ బాబు ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలవడం చాలా గర్వంగా ఉంది. అడివి శేష్, శోభితా, సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్ తిక్క.. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్' అని రాసుకొచ్చారు. 


అడివి శేష్ జంటగా సయీ మంజ్రేకర్, ప్రధాన పాత్రలో శోభితా ధూళిపాళ్ల, హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. మహేష్ బాబు, నమ్రత, అనురాగ్, శరత్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.


Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!


Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్