చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. తన నటనతో తెలుగు వారికి దగ్గరైంది మీరా జాస్మిన్. తన అందం.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది. హోమ్లీగా కనిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 


తెలుగులో పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర' వంటి సినిమాల్లో నటించింది. విశాల్ తో నటించిన 'పందెం కోడి' సినిమా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఒకానొక దశలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన ఈ బ్యూటీ 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. 


అయితే పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. అయినప్పటికీ సినిమాలవైపు తిరిగి చూడలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఉంది. అందుకే సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మీరాజాస్మిన్. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి వెల్కమ్ మెసేజ్ లు పెడుతున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టాడు. 


ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం ఓ మలయాళ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది మీరా. ఇప్పుడు పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీఎంట్రీ కోసం జిమ్ కు వెళ్తూ వర్కవుట్ చేస్తూ.. పెర్ఫెక్ట్ షేప్ లోకి రావడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి తెలుగులో ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి!








Also Read: 'అన్ స్టాపబుల్' రివైండ్.. అల్లరి బాలయ్య..




Also Read: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?


Also Read: బాలయ్యకు వర్మ రిక్వెస్ట్.. 'అన్ స్టాపబుల్' షోలో ఛాన్స్ దొరుకుతుందా..?


Also Read: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. 'గని' పవర్ ప్యాక్డ్ పంచ్..




 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి