తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి, సాహో, ఇప్పుడు సలార్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సలార్ మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈమెను తెలుగు ప్రజలు గుర్తు పట్టడం కష్టమే. ప్రస్తుతానికి ఆమె చేసిన సినిమా ఒక్కటే. అక్కినేని సుశాంత్ హీరోగా చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’లో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా ఓటీటీలో విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ రాకపోయినా, మీనాక్షి నటనకు  మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రవితేజ ‘ఖలాడి’మూవీలో నటిస్తోంది.  ఈ సినిమా విడుదల అవ్వక ముందే ఏకంగా బాహుబలి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ఇంకా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. 


మీనాక్షి చౌదరి వైద్యవిద్యను చదివింది. డెంటిస్టుగా డిగ్రీ అందుకుంది. మిస్ హర్యానాగా గెలవడంతో ఆమె చూపు సినిమాలపై పడింది. 2018 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ‘మిస్ గ్రాండ్’ గా ఎంపికైంది. అలాగే ఇండియా తరుపున మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు మయన్మార్ వెళ్లింది. అందులో రెండో స్థానంలో నిలిచింది. హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్ 2లో కూడా ఈ భామ నటిస్తున్నట్టు టాక్. 





Also read: రెహమాన్ సంగీతంలో బతుకమ్మ సాంగ్... ఈసారి పాట మరింత అదిరిపోద్ది