'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ గనుక లేకుంటే జనవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యేది. కానీ కుదరలేదు. ఇప్పుడు మార్చి 25న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతూనే ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ ను తన స్పీచ్ తో మరింత పెంచేశారు జక్కన్న. 


డిసెంబర్ లో ముంబై వేదికగా 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 


సినిమాలో పర్టిక్యులర్ గా ఓ సీన్ గురించి మాట్లాడారు రాజమౌళి. ఇప్పటివరకు ఏ ప్రోమోలో కూడా ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏం చూపించలేదని.. దాని గురించి ఎవరికీ ఐడియా లేదని అన్నారు. ఆ సీన్ ను థియేటర్లో చూసినప్పుడు జనాల్లో ఎగ్జైట్మెంట్ మాములుగా ఉండదని జక్కన్న చెప్పుకొచ్చారు. 


సినిమా సెకండ్ హాఫ్ లో ఈ సీన్ వస్తుందని.. తెరపై ఆ సీన్ చూస్తున్నప్పుడు నరాలు బిగుసుకుపోతాయని.. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారని.. కానీ మీ గుండె వేగంగా కొట్టుకుంటుందని తన మాటలతో సీన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. చరణ్, తారక్ అంత అద్భుతంగా నటించారని.. ఇంతకుమించి ఆ సీన్ గురించి ఇంకేమీ చెప్పనని అన్నారు. స్వయంగా రాజమౌళి ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారంటే.. ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో మరి!