సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. హీరో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను పూర్తి చేసుకొని ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేశారు. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు మహేష్. 


సమ్మర్ ట్రిప్ లో భాగంగా అందరూ కలిసి యూరప్ కి వెళ్లారు. నిజానికి సోమవారం నాడు మహేష్ రిటర్న్ అవ్వాల్సింది కానీ ఇప్పుడు ట్రిప్ ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మహేష్ అండ్ ఫ్యామిలీ కలిసి ఇటలీకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ సెల్ఫీను షేర్ చేశారు మహేష్ బాబు. తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారాలతో కలిసి ఈ ఫొటో తీసుకున్నారు మహేష్ బాబు. 


ఈ ఫొటోలో మహేష్ గడ్డం పెంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. రోడ్ ట్రిప్ లో ఉన్నామని.. నెక్స్ట్ స్టాప్ ఇటలీ.. ఈ క్రేజీస్ తో లంచ్ ప్లాన్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేష్. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 


Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై


Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్