సూపర్ స్టార్ మహేష్ బాబుకి జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చివరిగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు తాజాగా 'పికాక్' మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. 


రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అలానే ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. మ్యాగజైన్ పేరుకి తగ్గట్లుగానే పికాక్ లా రెడీ అయింది సామ్. ఇప్పుడు మహేష్ బాబు ఇదే మ్యాగజైన్ కోసం స్టైలిష్ గెటప్ లో రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇంటర్వ్యూ గ్లింప్స్ ను కొన్ని లైన్స్ రూపంలో షేర్ చేశారు. 


ఇందులో ఏమని రాసిందంటే.. ''చైల్డ్ ఆర్టిస్ట్ గా నా డెబ్యూ చాలా ఫన్ గా అనిపించింది. నేను చాలా చిన్నోడిని.. మహా అయితే ఎనిమిది, తొమ్మిదేళ్లు ఉంటాయేమో. సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. ,సినిమాల్లో నటిస్తావా..? అని నన్ను అడిగినప్పుడు 'వై నాట్' అనుకున్నా. ఆ తరువాత లొకేషన్ కి వెళ్లాను. అప్పుడు పెద్దగా టెన్షన్ కూడా పడలేదు. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ మా నాన్నగారు. ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. నా ముందు కెమెరా ఉందని, నటించాలనే ఫీలింగ్ నాలో లేదు. ఈ క్రెడిట్ మొత్తం నాన్నగారికే దక్కుతుంది' అంటూ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటలను షేర్ చేసుకున్నారు. 


Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్


Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార