కరోనా కాలంగా ప్రేక్షకులు థియేటర్లను వస్తారా..? ముఖ్యంగా ఓటీటీలకు అలవాటుపడ్డ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ముఖం చూస్తారా..? ఇవి కాకుండా ఆంధ్రాలో టికెట్ రేట్ల పరిస్థితేంటి..? ఈ మొత్తం డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది 'లవ్ స్టోరీ'. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సగం అనుమానాల్ని పటాపంచలు చేసిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో ఆశ్చర్యపరిచింది. నిన్న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. 



ఓవర్సీస్ లో అయితే ఈ ఏడాది ప్రీమియర్స్ తో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది 'లవ్ స్టోరీ'. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అటుఇటుగా రూ.6 కోట్ల 80 లక్షల వసూళ్లు సాధించింది. ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకి మూడు కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. 
ఏరియాల వారీగా కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.. 


నైజాం                   రూ.3.01 కోట్లు


సీడెడ్                   రూ.కోటి


ఉత్తరాంధ్ర            రూ.0.6 కోట్లు


గుంటూరు              రూ.0.59 కోట్లు


ఈస్ట్                        రూ.0.45 కోట్లు


వెస్ట్                         రూ.0.55 కోట్లు


కృష్ణ                        రూ.0.32 కోట్లు


నెల్లూరు                  రూ.0. 26 కోట్లు 


మొత్తం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.78 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సినిమా క్లైమాక్స్ విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. అది వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈరోజు హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీల్లో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది.



 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి