Lokesh Kanagaraj About Leo 2: ‘తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘లియో’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది. విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్టులో చేరింది. ఈ నేపథ్యంలో ‘లియో’కు సీక్వెల్ ఉంటుందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు లోకేష్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.


‘లియో 2’ కచ్చితంగా ఉంటుంది- లోకేష్


ఇంతకాలం ‘లియో’ సీక్వెల్ మీద వస్తున్న వార్తలను దర్శకుడు లోకేష్ నిజమేనని చెప్పారు. “’లియో 2’ కచ్చితంగా వస్తుంది. కానీ, ఇప్పుడు కాదు. ప్రస్తుతం ‘తలైవా 171’, ‘ఖైదీ 2’ సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ‘లియో 2’ మొదలవుతుంది” అని చెప్పారు. ఈ కామెంట్స్ తో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజయ్ కెరీర్ లో 67వ చిత్రంగా తెరకెక్కిన ‘లియో’లో త్రిష హీరోయిన్ గా నటిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్‌, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అదించారు.  


‘తలైవా 171’ పనుల్లో బిజీ బిజీ


ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ‘తలైవా 171’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నారు. ఏప్రిల్ 2024లో షూటింగ్ మొదలు పెట్టి, దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.  తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి.


వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్న విజయ్


మరోవైపు దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘దళపతి 68’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.


Read Also: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?