యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. 


తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. 'వార్నింగ్.. హీజ్ రెడీ టు స్టార్ట్ హంటింగ్' అంటూ మే 9న సాయంత్రం 4 గంటలకు అప్డేట్ రానుందని చెప్పారు. అయితే అది సినిమాలో పాటా..? ఏదైనా పోస్టరా..? లేక ట్రైలరా..? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు నిర్మాణ సంస్థను తిట్టిపోస్తున్నారు. పైగా సింహం పోస్టర్ తో ఈ అప్డేట్ ఇవ్వడంతో.. హీరో పోస్టర్ అయినా వేయాలి కదా అంటూ మండిపడుతున్నారు. 


మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఆరోజు సినిమా నుంచి అప్డేట్ రాబోతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read: మహేష్ బాబుని మూడు సార్లు కొట్టిన కీర్తి సురేష్ - మరీ అంత కోపమా?


Also Read: 'ఎఫ్3' ట్రైలర్ డబ్బింగ్ పూర్తి చేసిన వెంకీ - ఫ్యాన్స్ రెడీనా?