టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని టాక్. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు శర్వానంద్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. 

 

శర్వానంద్ ప్రధాన పాత్రలో 'ఛల్ మోహనరంగ' ఫేమ్ కృష్ణ చైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ కృతిశెట్టి మాత్రం ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

 

ప్రస్తుతం కృతిశెట్టి చాలా బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' వంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం', 'ది వారియర్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు శర్వానంద్ సినిమాకి కాల్షీట్స్ కేటాయిస్తుందో లేదో చూడాలి. 

 

ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో శర్వానంద్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ.. ఆయన సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే కోట్ల బిజినెస్ జరిగింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.