'అఖండ' సినిమాతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అలరించారు బాలయ్య. 

 

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన కథపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. శివరాజ్ కుమార్ నటించిన ఓ కన్నడ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఆ కన్నడ సినిమా రీమేక్ వేరే వాళ్లు తీసుకున్నారట. ఇక ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా..? అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని సమాచారం. 

 

అన్న మీద కోపంతో సొంత చెల్లెలే అతడిని చంపించేయడం.. ఆ తరువాత విదేశాల్లో పెరిగే మేనల్లుడు అయిన హీరోని కూడా చంపేయాలని ప్రయత్నించడం వంటి పాయింట్ ఈ కథను రాసుకున్నారట. అందుకే సినిమా కొంతభాగం షూటింగ్ అమెరికాలో ఉంటుందట. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ బాలకృష్ణ టైటిల్ చివర్లో కులం ట్యాగ్స్ ఉండకూడదని చెప్పారట. 

 

అందుకే ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. గతంలో బాలయ్య 'సమరసింహా రెడ్డి', 'నరసింహనాయుడు' వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమా టైటిల్స్ ఒక కులాన్ని మాత్రమే హైలైట్ చేసేలా ఉంటాయి. ఇకపై తన సినిమా టైటిల్స్ అలా ఉండకూడదని నిర్ణయించుకున్నారు బాలయ్య. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.