బాలీవుడ్ తనను భరించలేదని ఇటీవల మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేశారు. నిజానికి ఆయన టాలీవుడ్ సినిమాలే బాలీవుడ్ లో ఆడాలని.. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీనే కంఫర్ట్ అని.. బాలీవుడ్ కి వెళ్లి నటించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంలో అన్నారు. కానీ ఆయన మాటలను బాలీవుడ్ మీడియా తప్పుబడుతూ కథనాలను ప్రచురించింది. అయితే ఈ విషయంలో చాలా మంది మహేష్ బాబుని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 


రీసెంట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా మహేష్ ని సపోర్ట్ చేస్తూ రియాక్ట్ అయింది. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటిని వివాదం చేయక్కర్లేదని అంది కంగనా. బాలీవుడ్ నిజంగానే ఆయన్ను భరించలేదని.. ఎందుకంటే ఎంతోమంది ఫిలిం మేకర్స్ నుంచి ఆయనకు అవకాశాలు వచ్చాయని.. కానీ ఆయన తరం నటీనటులందరూ కలిసి టాలీవుడ్ ని ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా మార్చారని చెప్పింది కంగనా. 


మహేష్ బాబుకి తన సొంత ఇండస్ట్రీపై ఎంతో గౌరవం ఉందని.. దాని వలన ఆయన అలా చెప్పి ఉంటారని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. బాలీవుడ్ జనాలే కొందరు హాలీవుడ్ తమను భరించలేదనే తత్వంతో ఉంటారని వెటకారంగా కామెంట్ చేసింది కంగనా. ప్రస్తుతం ఈమె నటించిన 'దాఖడ్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  


Also Read: 'సర్కారు వారి పాట' ఫేక్ కలెక్షన్స్ - ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు


Also Read: నయనతారతో ధోనీ సినిమా - క్లారిటీ ఇచ్చిన టీమ్