బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా చేస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. బాలీవుడ్ స్టార్స్ పాల్గొనే ఈ షో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 8వ సీజన్ టెలీకాస్ట్ కు రెడీ అవుతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 26 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబోతున్నారు.  తాజాగా సీజన్ గెస్టుల లిస్టులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ సహా పలువురు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరు లేకపోవడంపై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. కేవలం నెపో కిడ్స్ ను మాత్రమే ఈ షోకు పిలుస్తారంటూ కరణ్ పై విమర్శలు చేస్తున్నారు.


కరణ్ జోహార్ పై నెటిజన్ల ఆగ్రహం


కంగనా నటించిన ‘తేజస్’ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, ఈ షోకు ఆమెను ఎందుకు గెస్టుగా పిలవలేదంటూ కంగనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “బాలీవుడ్ ఎప్పుడూ ఆశ్చర్యపడదు!  కరణ్‌ జోహార్ ప్రతిభావంతులైన నటులను కాకుండా నేపో కిడ్స్ ను మాత్రమే తన షోకు పిలుస్తారు. ‘కాఫీ విత్ కరణ్-8’ గెస్టుల లిస్టులో ఎవరు మిస్ అయ్యారో ఊహించండి!” అంటూ నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. మరో అభిమాని ట్వీట్ చేస్తూ, “కరణ్‌ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ గెస్ట్ లిస్ట్‌ లో కంగనా రనౌత్ తప్ప అందరూ ఉన్నారు! తన సినిమా విడుదలకు సిద్ధమవుతోందని తెలిసి కూడా! గెస్టుగా పిలువలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  “కరణ్‌ జోహార్ ఎప్పుడూ స్టార్ యాక్టర్స్ ను ‘కాఫీ విత్ కరణ్‌’ షోకు ఆహ్వానిస్తారు. కానీ, ఈసారి కంగనా రనౌత్ సినిమా ‘తేజస్’ విడుదలకు దగ్గరలో ఉందని తెలిసినా, అతడు నేపో కిడ్స్ ను ఆహ్వానించాడు” అని విమర్శిస్తున్నారు.


















విడుదలకు రెడీ అవుతున్న ‘తేజస్’


అటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఎక్కువగా డిఫరెంట్ జానెర్ సబ్జెక్ట్స్ తోపాటు లేడీ ఓరియంటెడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కంగనా ఖాతాలో ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'తేజస్'.  ఇందులో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, అనుజ్ ఖురానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్ పాత్రలో నటించింది.  


వరుస సినిమాలతో కంగనా ఫుల్ బిజీ


ఇటీవలే  'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా.  రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.  మరోవైపు కంగనా 'ఎమర్జెన్సీ' అనే మూవీలో కూడా నటిస్తోంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ కూడా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోంది. కంగనా సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: ఊర్వశి గోల్డెన్ ఫోన్ దొరికింది, ఇవ్వాలంటే ఆ కండీషన్​కు ఒప్పుకోవాలట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial