తిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన తల్లిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ఆగస్టు 13న శ్రీదేవి జయంతి. ఈ నేపథ్యంలోనే తన తల్లితో కలిసి తీసుకున్న చిన్ననాటి ఫోటోను జాన్వీ ఫోస్ట్ చేసింది. “హ్యాపీ బర్త్ డే అమ్మా. ప్రతి రోజు నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అని తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. తన తల్లి అంటే ఎంతో ఇష్టం అని జాన్వి పలు సందర్భాల్లో చెప్తూనే ఉంది.


తల్లి మీద ప్రేమతో తన చేతి మీద అప్పట్లో ఒక పచ్చ బొట్టు వేయించుకుంది. 'ఐ లవ్యూ మై లబ్బూ' అని టాటూ పొడిపించుకుంది. అది మొదట ఎవరో బాయ్ ఫ్రెండ్ పేరని సోషల్ మీడియాలో చర్చ కూడా నడిచింది. కానీ వాటన్నిటికీ తెర దించుతూ అది తన తల్లి గురించి అని చెప్పుకొచ్చింది. టాటూలో ఉన్న లబ్బూ పేరు జాన్విదే. ఆ టాటూలో ఉన్న వ్యాఖ్యలు దివంగత శ్రీదేవి రాసిన గోల్డెన్ వర్డ్స్. 


జాన్విని ఉద్దేశిస్తూ శ్రీదేవి పేపరు మీద అలా రాశారట. జాన్విని ఆమె లబ్బూ అని ముద్దుగా పిలిచేవారట. ‘‘నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ బేబీవి. ఐ లవ్యూ మై లబ్బూ” అని శ్రీదేవి రాసిన ఆ పదాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఆ పదాలను తన చేతి మీద టాటూలా వేయించుకుంది. శ్రీదేవి పేపరు మీద రాసిన హ్యాండ్ రైటింగ్ నే యథావిధిగా టాటూ పొడిపించుకుంది. ఆ నొప్పిని భరించలేక ఆమె.. గోవింద.. గోవిందా.. అంటూ దేవుడినే తలుచుకుంది.


జాన్వి కపూర్ తెలుగులో పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30 చిత్రంలో జాన్వీ హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. అది కూడా ఎంతవరకు వాస్తవమనేది తెలియరాలేదు. కానీ, ఈ కాంబోపై మాత్రం ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా జాన్వీ కపూర్.. ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమనేది అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది.


Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?


Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!