జానకి మళ్ళీ పుస్తకం పట్టుకోవడం చూసిన మల్లిక బిత్తరపోయి తను అనుకున్నది ఏది జరగడం లేదని తల గోడకేసి బాదుకుంటుంది. అది చూసి విష్ణు ఏమైందని అడిగేసరికి కడుపులో బిడ్డకి బాగుంటుందని చెప్పి కవర్ చేస్తుంది. అప్పుడే జ్ఞానంబ మల్లికని పిలుస్తుంది. తన దగ్గరకి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తుంటే గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. జ్ఞానంబ కడుపుతో ఉన్న కోడళ్ళు ఇద్దరికీ చిన్న పిల్లల ఫోటోలు ఇచ్చి గోడకి అతికించుకోమని చెప్తుంది. రోజు వాటిని చూస్తే పుట్టే పిల్లలు కూడా అందంగా పుడతారని అంటుంది. మల్లిక తన కడుపు గురించి మాట్లాడుతుంటే జానకి వస్తుంది. తనని చూసి మల్లిక మాట్లాడేది నోరు మూస్తుంది. పుట్టబోయే బిడ్డల గురించి జ్ఞానంబ చాలా ఆశగా మాట్లాడుతుంది.


తన దొంగ కడుపు గురించి జానకి ఎక్కడ బయట పెడుతుందో అని మల్లిక భయపడుతూ అక్కడి నుంచి జారుకుంటుంది. మల్లిక నిజంగానే ప్రెగ్నెంట్ అనుకుని అత్తయ్యగారు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఇక దానికి ముగింపు పలికేలా చెయ్యాలని జానకి అనుకుంటుంది. 


జానకి; ఇకనైనా నీ డ్రామా ఆపు. నీ అబద్దం నిజం అనుకుని పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా. నీది దొంగ కడుపు అని తెలిస్తే అసలు తట్టుకోలేరు, నువ్వు మోసం చేశావని తెలిస్తే ఏం చేస్తారో నువ్వే ఊహించుకో అనగానే మల్లిక బొమ్మ వేసుకుంటుంది. నిజానికి నువ్వు ఆడిన నాటకం గురించి చెప్పాలని అనుకుంటున్నా కానీ అది నీకు ప్రమాదం అని సైలెంట్ గా ఉంటున్నా, నీకు నువ్వుగా అత్తయ్యగారి కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకో


Also read: లాస్యతో తెగదెంపులు చేసుకున్న నందు- ఛాలెంజ్ లో గెలిచిన సామ్రాట్


మల్లిక: తొందరపడి ఈ విషయం అత్తయ్యగారికి చెప్పకు


జానకి: ఈ రోజు రాత్రి వరకే నీకు టైమ్ నీకు నువ్వుగా నిజమ్మ చెప్పేయ్ లేదంటే రేపు మార్నింగ్ నేనే చెప్పేస్తాను


మాధురి కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి జానకి హాస్పిటల్ కి వెళ్తుంది. తలకి ముందు భాగం బలమైన దెబ్బ తగలడం వల్ల రికవరీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని డాక్టర్ జానకితో చెప్తుంది. అదేంటి దెబ్బ తగిలింది తల వెనుక కదా అని జానకి డౌట్ గా అడుగుతుంది. అది పెద్ద దెబ్బ కాదు తల ముందు భాగం కనుబొమ్మ మీద ఎవరో రాడ్ లేదా బలమైన వస్తువుతో కొట్టారు దాని వల్ల తన పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్తుంది. వెనుక తగిలిన దెబ్బ వల్ల అయితే రెండు రోజుల్లో కొలుకునేది, తల ముందు భాగం అవడం వల్ల తను కోమాలోకి వెళ్ళిందని డాక్టర్ అంటుంది.


జానకి జరిగింది అంతా తలుచుకుంటుంది. మల్లిక వెళ్ళి జ్ఞానంబ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. తనది నిజమైన కడుపు కాదని అసలు తను కడుపుతో లేనని చెప్పేసరికి జ్ఞానంబ కోపంగా చెంప పగలగొడుతుంది. అలా అని మల్లిక కల కంటుంది. ఇప్పుడు నిజం చెప్తే పోలేరమ్మ బలి తీసుకుంటుందని భయపడుతుంది. అటు జానకి మాధురి ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్తుంది. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అక్కడ ఒక ఉంగరం జానకికి దొరుకుతుంది.


Also Read: సాక్ష్యం సంపాదించిన ఝాన్సీ, చేతులెత్తేసిన యష్ లాయర్ - అందరికీ షాకిచ్చిన వేద


తరువాయి భాగంలో..


ఆ ఉంగరం తీసుకుని జానకి గోల్డ్ షాప్ కి వెళ్తుంది. పరిశీలించిన షాపు అతను ఆ ఉంగరం కన్నబాబు కొన్నాడని చెప్తాడు. అది విని జానకి షాక్ అవుతుంది. కార్పొరేట్ కొడుకు కన్నబాబు అని షాప్ అతను అంటాడు.