లక్షపత్రి పూజ చేసి చేతుల నొప్పులతో మల్లిక అల్లాడిపోతుంది. తన దొంగ కడుపు జానకి ఎక్కడ బయట పెట్టేస్తుందో అని కంగారుపడుతుంది. ఒకవేళ జానకి కడుపు విషయం బయటపెడితే తను చదువు మానేసిందని చెప్పి ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే చికిత వచ్చి కాసేపు మల్లికని ఆడుకుంటుంది. రామా జానకి చదువు ఆలోచించి దిగాలుగా ఉంటాడు. తనని ఎలాగైనా తిరిగి చదువుకోవడానికి ఒప్పించాలని అనుకుంటాడు. జానకి మంచి హుషారుగా ఉంటుంది. జ్ఞానంబ రామాని పిలిచి భాను ఫోన్ చేసింది చూడాలని ఉందని రమ్మని చెప్పిందని చెప్తుంది. జానకి వచ్చి భాను ఎవరు అత్తయ్యగారు అని అడుగుతుంది.


Also Read: కార్తీక్ ని ప్రశ్నించిన దీప, మోనితను తీసుకెళ్లిపోయిన సౌందర్య, ఇంద్రుడిలో మార్పు -ఇదే కీలక మలుపు


భాను అంటే అమ్మ చిన్ననాటి స్నేహితురాలు అని రామా చెప్తాడు. భానుకి రామా అంటే చాలా ఇష్టం, రామాకి మరో తల్లిలాంటిది వీడిని పెంచుకుంటాను అని కూడా అడిగిందని జ్ఞానంబ వాళ్ళు చెప్తారు. ఆమె గురించి రామా గొప్పగా చెప్తాడు. రామా వెంట జానకి కూడా వస్తానని అడుగుతుంది. చదువుకోవాలి కదా అని రామా నసుగుతుంటే తీసుకెళ్లమని జ్ఞానంబ చెప్తుంది. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. వాళ్ళలా సరదాగా వెళ్తామని అడుగుతుంది. కడుపుతో ఉన్నవాళ్ళు అంతదూరం ప్రయాణం చేయకూడదు అని చెప్తుంది. రామా, జానకి కలిసి బైక్ మీద వెళ్ళడం చూసి మల్లిక ఏడుపు మొదలుపెడుతుంది. బైక్ మీద వెళ్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పోలేరమ్మ వల్ల ఎంజాయ్ మెంట్ లేకుండా పోయిందని ఏడుస్తుంటే విష్ణు వచ్చి ఏమైందని అడుగుతాడు.


కడియసావరంలో ఎవరో భానుమతి ఉన్నారంట కదా బావగారిని చూడాలని చెప్పిందట వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు. నాకు కూడా మీతో కలిసి బైక్ మీద వెళ్తానని అత్తయ్యగారిని అడిగాను వద్దన్నారు అని ఏడుస్తూ చెప్తుంది. కడుపుతో ఉన్నావ్ కదా అందుకే వద్దు అన్నారు బయటకి వెళ్ళడం తప్ప ఇంకేం అడిగినా చేస్తాను అని విష్ణు అంటాడు. సరే అయితే బిర్యానీ కావాలి అని అడుగుతుంది. బిర్యానీ కోసమే ఈ డ్రామా అంతా ఆడుతున్నావ్ కదా అని విష్ణు కోపంగా అనేసరికి మళ్ళీ మల్లిక ఏడుపు మొదలెడుతుంది. ఇక చివరికి సరే తీసుకొస్తానులే అంటాడు. రామా, జానకి ఇద్దరూ బైక్ మీద సరదాగా వెళ్తు ఉంటారు. ఇద్దరు కలిసి పొలాల్లో తిరుగుతూ సంతోషంగా ఉంటారు. రామా, జానకి ఒకరినొకరు కాసేపు పొగుడుకుంటారు. జానకి చిన్న పిల్లలా సరదాగా ఆడుకోవడం చూసి రామా మురిసిపోతాడు. ‘జానకి కలగనలేదు’ అని సాంగ్ వేసుకుంటారు. ఇద్దరు కలిసి కొత్తగా పెళ్ళైన జంటలాగా ముచ్చటగా ఉంటారు.


Also Read: వసుకి నిజం చెప్పేసిన జగతి, దేవయానిని టెన్షన్ పెట్టిన ధరణి


తరువాయి భాగంలో..


రామా, జానకి భాను ఇంటికి వస్తారు. రామా దాక్కుని భానుకి చెప్పొద్దని చెప్తాడు. భానుగా ఇంద్రనీల్ భార్య ఎంట్రీ ఇస్తుంది. ఇంత పొద్దుపోయిన తర్వాత వచ్చావ్ అని జానకిని అడుగుతుంది. రామా వచ్చి నీ కోడలు అని చెప్తాడు.