జన్మాష్టమి సంబరాల్లో మల్లిక కోలాటం ఆడుతుంటే అది చూసి జ్ఞానంబ గుర్రుగా ఉంటుంది. జెస్సి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అఖిల్ ఎంత చెప్తున్న వినకుండా పట్టించుకోకుండా అలా చేశాను ఇప్పుడు అమ్మానాన్నలకి తెలిసి నిజంగానే ప్రాబ్లం అయ్యింది. దీనికి కారణం ఎవరో చెప్పే వరకు అమ్మ వాళ్ళు ఊరుకోరు. దీనికి సొల్యూషన్ ఎంతో అఖిల్ ని అడిగి తెలుసుకోవాలి త్వరగా ప్రాబ్లం సాల్వ్ చెయ్యమని అఖిల్ కి చెప్పాలని అనుకుంటుంది. అఖిల్ కి ఫోన్ ట్రై చేస్తుంది కానీ కలవదు. దీంతో డైరెక్ట్ గా అఖిల్ ఇంటికి వెళ్లాలని బయల్దేరుతుంది. అటు జ్ఞానంబ ఇంట్లో సంబరాలు మిన్నంటుతాయి.


ఉట్టి కొట్టేందుకు గోవిందరాజులు ట్రై చేస్తాడు కానీ కుదరకపోయేసరికి విష్ణుని రంగంలోకి దింపుతారు. కానీ తన వల్ల కూడా కాకుండా జానకి, జ్ఞానంబ తాడు లాగుతూ ఉంటారు. పనికి పోటు రాజు తిండికి తిమ్మరాజు దేనికి పనికిరాడు నా మొగుడు అని మల్లిక తిట్టుకుంటుంది. విష్ణు వల్ల కూడా కాకపోవడంతో రామాని పిలుస్తారు. తను కోడా కొట్టలేకపోవడంతో రామా తమ్ముడు అఖిల్ ని భుజాల మీద పెట్టుకుని ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టిన ఆనందంలో ఉండగా ఇంటికి జెస్సి రావడం అఖిల్ గమనించి షాక్ అవుతాడు.


Also Read:  అసలు ఏం జరుగుతోందని నిలదీసిన కార్తీక్, మోనితకు సవాల్ విసిరి వెళ్లిన దీప!


మా ఇంటికి ఎందుకు వచ్చావ్ ఎవరైనా చూస్తే ఎంత డేంజర్ నువ్వు వెళ్ళు నేను వచ్చి తర్వాత మాట్లాడతాను అని అంటాడు. జెస్సి ఏడుస్తూ తను నెల తప్పిన విషయం చెప్తుంది. కారణం ఎవరని అమ్మ వాళ్ళు నిలదీసి అడిగారు అని అంటుంది. చెప్పావా అని టెన్షన్ గా అడుగుతాడు లేదని చెప్తుంది. ఇంట్లో తెలిసిన విషయం బయట జనాలకి తెలియక ముందే మనం పెళ్లి చేసుకోవాలని జెస్సి అంటుంది. ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. ఇప్పుడు కాదు ఈ విషయం గురించి నేను ఫోన్ చేసి మాట్లాడతాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని జెస్సి బతిమలాడటం జానకి కంట పడుతుంది. జెస్సి ఇంటికి వచ్చిందంటే ఏదో సీరియస్ విషయమై ఎంతో కనుక్కుందామని జానకి అనుకుంటూ ఉండగా జ్ఞానంబ పిలుస్తుంది.


ఇంట్లో అందరికీ జ్ఞానంబ విందు భోజనం ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఎలాగైనా కుర్చీలో కూర్చునే భోజనం చెయ్యాలని మల్లిక అనుకుంటూ ఉంటుంది. కింద కూర్చుని తినమని గోవిందరాజులు చెప్తాడు. నేను కింద కూర్చుని తింటే కడుపులో బిడ్డకి ప్రమాదం కదా అని అంటుంది. బిడ్డకి ప్రమాదం నెలలు నిండినాక ఇప్పుడు కాదులే పో వెళ్ళి కింద కూర్చో అంటుంది. నేను కింద కూర్చుంటే మీకే అవమానం ఏదైనా జరిగి కడుపు పోతే అందరూ మిమ్మల్నే అంటారు అని మల్లిక అనేసరికి జ్ఞానంబ నాలుగు చీవాట్లు పెట్టి కుర్చీలో కూర్చొని తినమని అంటుంది. జానకి మల్లికకి వడ్డిస్తుంది. ఇదే సందు దొరికిందనుకుని అందరి ముందు జానకి నెల తప్పలేదని అవమానకరంగా మాట్లాడుతుంది. వచ్చే సంవత్సరానికైనా నీ కడుపు పండాలని కోరుకుంటున్న అని వెటకారంగా మాట్లాడుతుంటే గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. అఖిల్ పరధ్యానంగా ఉండటం జానకి గమనిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వెంటనే తెలుసుకోవాలని జానకి అనుకుంటుంది.     


Also Read: పరధ్యానంలో రిషి - రిషి ధ్యానంలో వసు, ప్రేమ పిచ్చి ముదిరింది!