‘రాజు గారి గది’ సిరీస్ తో తెలుగులో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అశ్విన్.  ప్రముఖ యాంకర్, ఫిల్మ్ మేకర్ ఓంకార్ గా తమ్మడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సరికొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కావడం లేదు. అయినా, జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు అశ్విన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ‘హిడింబ’ అనే అవుట్ అంట్ అవుట్ యాక్షన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాతో అశ్విన్ ఖాతాలో సాలిడ్ హిట్ పడటం ఖాయం అంటున్నారు సినీ జనాలు.


త్వరలో ‘హిడింబ’ ట్రైలర్ విడుదల


తాజాగా ఈ సినిమా నిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే ‘హిడింబ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ట్రైలర్ ఉండబోతోందని ప్రకటించారు.  “ఇంతకు ముందెన్నడూ చెప్పని కథను అందిస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇంకా అన్వేషించని జోనర్ లో ఈ సినిమా రాబోతోంది.  మీ అందరినీ ఆశ్చర్యపరిచేలా త్వరలో ట్రైలర్ విడుదల కాబోతోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.  






అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌


అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో  అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. వికాస్‌ బడిసా సంగీతం అందిస్తున్నారు.  రాజశేఖర్‌ సినిమాటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.










‘రాజు గారి గది‘ సిరీస్ లో అశ్విన్ బాబు హీరోగా నటించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి భాగం 2015లో విడుదల అయ్యింది. ఈ హార్రర్ కామెడీ చిత్రంలో అశ్విన్ బాబు సరసన ధన్య బాలకృష్ణ నటించారు.  ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రాజు గారి గది 2‘ అక్టోబర్ 2017లో విడుదల కాగా, మూడవ సీక్వెల్ ‘రాజు గారి గది 3‘ 2019లో విడుదలైంది. 


Read Also: విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్