తులసి, సామ్రాట్ రోడ్డు మీద నడుస్తూ ఒక షాప్ దగ్గర ఆగుతారు. అక్కడ రోజ్ మిల్క్ బాగుంటుందని తులసి అంటుంది. షాప్ దగ్గర చాలా రష్ గా ఉందని తీసుకోవడం చాలా కష్టమని తులసి అంటే పర్వాలేదు తీసుకొస్తానని సామ్రాట్ వెళతాడు. ఎలాగోకలా కష్టపడి సామ్రాట్ రెండు గ్లాసులు రోజ్ మిల్క్ తీసుకొస్తాడు కానీ అందులో రోజ్ మిల్క్ ఉండదు. అదెక్కడ అనేసరికి ఇదిగో ఇక్కడ నా షర్ట్ మీద అని ఒకాయన వస్తాడు. సరిగా తెచ్చే పని లేదా ఎలా వేగుతున్నావ్ ఈయనతో అని తిట్టేసి వెళ్ళిపోతాడు.


లాస్య, భాగ్య కూర్చుని మాట్లాడుకుంటారు. ఈ ఇల్లు నీ పేరు మీద రాయించుకున్న విషయం కొద్ది రోజులు దాచిపెట్టొచ్చు కదా ఎందుకు తొందర పడ్డావ్. అలా చేసేసరికి ఇంట్లో అందరికీ దూరం అయ్యావ్ అని దెప్పిపొడుస్తుంది. నేను ఎక్కడ వాటా అడుగుతానో అనే నాకు తెలియకుండా ఇంత దూరం తీసుకొచ్చావ్ ఇప్పుడు నా అవసరం వచ్చేసరికి పిలిచావ్ అని వెటకారం చేస్తుంది. దాన్నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అని భాగ్య లాస్య చెవిలో ఏదో ప్లాన్ చెప్తుంది. తులసి, సామ్రాట్ షాపింగ్ కోసం వేరే చోటకి వెళ్ళడం కోసం మళ్ళీ బస్సెక్కుతారు. బస్సులో ఒక వ్యక్తి పక్కనే ఉన్న అమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తాడు. అది చూసి తులసి బస్సు ఆపమని అడుగుతుంది.


Also Read: ఆదిత్య చెంప పగిలింది, నిజం తన్నుకొచ్చింది- వేద చేసిన పనికి యష్, మాళవిక షాక్


బస్‌ ఆపేసరికి అందరూ తనవైపు చూస్తారు. నా వైపు కాదు చూడాల్సింది అక్కడ ఒక హీరో చేస్తున్న గొప్ప పని చూసి ప్రోత్సహించండి అని అందరితో క్లాప్స్ కొట్టిస్తుంది. దీంతో అతను తల దించుకుంటాడు. చేసేది తప్పని తెలిసి ఎందుకు ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నావ్ అని కాసేపు క్లాస్ పీకుతుంది. దీంతో అతను తులసి అన్న ఒక్క మాటకే సారి చెప్పేస్తాడు. తులసి చేసిన పనిని సామ్రాట్ తెగ పొగిడేస్తాడు. సామాన్లు మోయలేక సామ్రాట్ అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. పరంధామయ్య, అనసూయ సరదాగా చెస్ ఆడుకోవడానికి చూస్తారు. చెస్ కి ఇంట్లో జరిగే వాటిని లింకు పెడుతూ చాలా చక్కగా చెప్తాడు పరంధామయ్య.


లాస్య వచ్చి తనతో కూడా మాట్లాడమని అడుగుతుంది. అనసూయ వెళ్లిపోతుంటే మీతో మాట్లాడాలి అని లాస్య అడుగుతుంది. మనం ఉంటుంది లాస్య ఇంట్లో తను ఈ ఇంటి యాజమనురాలు తన మాట వినాలి కదా కూర్చోమని చెప్తాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇంట్లో అందరూ తన మీద కోపంగా ఉన్నారని అందుకే ఒక నిర్ణయానికి వచ్చానని చెప్పి ఇంటి డాక్యుమెంట్స్ వాళ్ళ ముందు పెడుతుంది. ఈ ఇంటితో తనకి సంబంధం లేదని దాన్ని వదులుకుంటున్నా అని చెప్తుంది. మీరు ఎవరి మీద ట్రాన్స్ఫర్ చేయమంటే వారికి రాస్తాను, ఆస్తి మీద మోజుతో ఇలా చెయ్యలేదు కేవలం ఇన్ సెక్యూరిటీతో ఇలా చేశాను. ఈ ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అయిన కోడలిగా  ఎవరి మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాను ఒంటరిగా అనిపించిందని మొసలి కన్నీళ్ళు కారుస్తుంది. నందు కూడా తన ఫిలింగ్స్ పట్టించుకోలేదని అందుకే ఇంటిని తన పేరు మీదకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్న అని చెప్తుంది.


Also Read: పోలీస్ ఆఫీసర్‌గా మాధురి కేసు తీసుకోమన్న రామా - రంగంలోకి దిగిన జానకి ఐపీఎస్


తరువాయి భాగంలో..


నందు లాస్యతో కోపంగా మాట్లాడతాడు. అప్పుడే తులసి పిల్లలకి కావాల్సినవి తీసుకుని ఇంటికి వస్తుంది. ‘మన మధ్య ప్రేమ చచ్చిపోయింది, బంధం పగిలిపోయింది. ప్రస్తుతం ఉంది ప్రేమ లేని నిర్జీవమైన బంధం మాత్రమే. తులసికి నాకు మధ్య ఎప్పుడు ప్రేమ లేదు కానీ గౌరవం ఉండేది. కానీ మన మధ్య ఉన్న బంధంలో ప్రేమ, లేదు గౌరవం లేదు. లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. నాలుకు గోడల మధ్య మాత్రం నువ్వెవరో నేనెవరో ఎలాంటి బంధం లేదని’ నందు తెగేసి చెప్పేస్తాడు.