తులసి తన చిన్ననాటి ఇల్లు చూడాలని అక్కడి జ్ఞాపకాలు నెమరువేసుకోవాలని చీటి రాసి ముడుపు కడుతుంది. ఆ ముడుపు విప్పి సామ్రాట్ చదువుతాడు. అది పూజారి గమనించి అమ్మవారికి ఆమె కోరిక వెళ్ళక ముందే ముడుపు విప్పారు అది మీరే తీర్చాలని చెప్పడంతో అందుకు సరే అంటాడు. తన పుట్టిన ఊరు ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నంలో సామ్రాట్ ఉంటాడు. ఇద్దరూ కారులో గుడి నుంచి వెళ్తు మాట్లాడుకుంటారు. ఆఫీసు పని మీద ఒక గ్రామానికి వెళ్ళాలి రెడీగా ఉండమని తులసికి చెప్తాడు. ఏ ఊరని అంటే నోరుజారి తెలియదని అంటాడు కానీ తర్వాత కవర్ చేసుకుంటాడు.


పరంధామయ్య, అనసూయ, నందు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ్ ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ వస్తుంది. ఎప్పుడు లేనిది ప్రేమ్ బయట ఫుడ్ ఆర్డర్ పెట్టడం ఏంటని నందు ఆలోచిస్తాడు. లాస్య వచ్చి ఎవరు ప్రేమ్ పెట్టాడా అని అడుగుతుంది. నీకేలా తెలుసు అని అంటాడు.


లాస్య: మనిషికొక రకం వంట అవసరమా అని అన్నాను. వంట అయిపోయిన తర్వాత శ్రుతి ప్రేమ్ కోసం మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేస్తుంటే వద్దని అన్నాను అందుకే ప్రేమ్ వాళ్ళ ఇలా చేసినట్టు ఉన్నారు. అది వాళ్ళకి బాధగా అనిపించినట్టు ఉందని సోరి అని చెప్తుంది


Also Read: 'పెళ్ళైన కొత్తలో' సినిమాలా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌- వేద, యష్‌ని కలిపేందుకు వెకేషన్ ప్లాన్


నందు: ఇంటి పరిస్థితి తెలుసు కదా వృధా ఖర్చులు తగ్గించుకో, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో


శ్రుతి బాధపడుతుంటే అనసూయ వచ్చి ఓదారుస్తుంది. చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి అంకుల్ ముందు కావాలని ఇలా చేసిందని బాధపడుతుంది. ఈ విషయం ప్రేమ్ తెలియకుండా చూసుకోమని పరంధామయ్య అంటాడు. సామ్రాట్ ఇంటికి వచ్చేసరికి హనీ కోపంగా ఉంటుంది. తనని ఎలా కూల్ చేయాలా అని సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు. హనీ కాసేపు సామ్రాట్ ని ఆటపట్టించి తర్వాత తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తుంది. అది విని సామ్రాట్ చాలా ఫుల్ హ్యాపీగా ఉంటాడు. వెంటనే ఈ విషయం చెప్పడానికి తులసికి సామ్రాట్ ఫోన్ చేస్తాడు. ఇద్దరూ కాసేపు సోది మాట్లాడుకుంటారు. హనీ విషయం తెలిసి తులసి కూడా సంతోషిస్తాడు.


పరంధామయ్య ఆకలితో అల్లాడిపోతాడు. అప్పుడే అనసూయ ఫుడ్ తీసుకుని వస్తుంది. ప్లేట్ అనసూయ పరంధామయ్యకి ఇస్తుంటే లాస్య వచ్చి లాక్కుంటుంది. మీ మావయ్యకి అల్సర్ ఉందని వెంటనే తినకపోతే కడుపులో మంట వస్తుంది ఇవ్వమని చెప్తుంది. కానీ లాస్య మాత్రం ఇలా మసాలా ఫుడ్ తింటే పైకి పోతారు. కడుపులో మంటగా ఉంటే పండ్లు తినాలి, ఆరోగ్యానికి మంచిది, ఖర్చు ఆదా అని అంటుంది. తనకి వంట చేసి పెడితే ఒళ్ళు అయినా తగ్గుతుంది కదా అని లాస్య అనసూయని నానా మాటలు అంటుంది. అది చూసి ఇద్దరు చాలా బాధపడతారు. ఇప్పుడు మనం తనతో గొడవపడితే నందు ఊరుకోడు, తులసికి కూడా చెప్పకు అని అంటాడు. పాపం ముసలాయన ఆకలిని అణుచుకోవడానికి మంచి నీళ్ళు తాగుతాడు.


Also Read: తులసి కోరిక తీర్చాలని డిసైడ్ అయిపోయిన సామ్రాట్- ఆవేశంతో రగిలిపోయిన ప్రేమ్




 



తరువాయి భాగంలో.. 


తులసి కోరిక తీర్చడానికి తనకి తెలియకుండా సామ్రాట్ అక్కడికి తీసుకెళ్తాడు. తన సొంత ఊరు చూసి తులసి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంది.